Saturday, 18 May 2024 01:00:10 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Karimnagar: తాడికల్ శివారులోని శివాలయంలో ఓ మహిళ హత్యకు కారణం ఇదే.. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

Date : 05 October 2023 09:14 PM Views : 76

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఓ దారుణహత్యను ఛేదించిన కరీంనగర్ జిల్లా పోలీసులకు.. ఆ హత్యకు గల కారణాలేంటో తెలిసి షాక్ కు గురయ్యారు. తండ్రి ఆరోగ్యం బాగాలేదని.. ఆసుపత్రులకు వెళ్లినా బాగుపడటం లేదని.. ఓ మహిళ ఓ బాబా వద్దకు వెళ్లిన క్రమంలో తండ్రి అనారోగ్య పరిస్థితుల కోసం వచ్చిన మహిళపై మానవత్వం కూడా లేని ఆ దొంగలు.. బంగారం కోసం దారుణహత్యకు పాల్పడ్డారు. ఓవైపు తండ్రి అనారోగ్యానికి పరిష్కారం కనుక్కునేందుకు కాలికి బలపం కట్టి ఆసుపత్రుల చుట్టూ తిరిగిన కూతురు.. చివరకు దేవుడిపై భారం వేసి.. Karimnagar: తాడికల్ శివారులోని శివాలయంలో ఓ మహిళ హత్యకు కారణం ఇదే.. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు కరీంనగర్ జిల్లా, అక్టోబర్ 05: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివారులోని శివాలయంలో ఓ మహిళ దారుణహత్యను పోలీసులు ఛేదించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామానికి చెందిన గుండారపు ప్రమీల అనే 55 ఏళ్ల మహిళ.. తన తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడం.. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా నయం కాకపోవడంతో.. మొలంగూర్‌లో తాయిత్తులు కట్టే ఓ బాబా అడ్రస్ కనుక్కుని వచ్చింది. కానీ, సదరు తాయిత్తులు కట్టే బాబా లేకపోవడంతో.. చేసేదేమీలేక తిరుగు ప్రయాణమైంది. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఆటోలోని వ్యక్తులకు ప్రమీల ఒంటిమీదున్న బంగారు నగలపై కన్నుపడింది. మాయమాటలు చెప్పి.. మేం తాయిత్తు కట్టిస్తామంటూ నమ్మబలికి ప్రమీలను, ఆమె తండ్రిని ఆటో ఎక్కించారు. ఆటోలో డ్రైవర్ తో పాటు.. మరో వ్యక్తి ఉండగా.. వెనుక ఓ పిల్లాణ్ని పెట్టుకున్న మహిళ కూర్చుంది. వారి పక్కనే ప్రమీల, తన తండ్రితో పాటు కూర్చుంది. అలా ఆటోను మెల్లిగా తాడికల్ గ్రామం వైపు తీసుకొచ్చిన డ్రైవర్ శివార్లలోని ఓ శివాలయం వద్దకు తీసుకెళ్లి.. ప్రమీల ఒంటిపై చూసిన బంగారు నగలు ఇవ్వాలని కత్తితో బెదిరిస్తూ డిమాండ్ చేశాడు. కానీ ప్రమీల వారించేసరికి.. కత్తితో విచక్షణారహితంగా ప్రమీలను చంపేసి.. ఆమె ఒంటిపైనున్న నగలను దోచుకెళ్లారు ఆ దొంగలు. సమాచారం తెలుసుకున్న హుజూరాబాద్ పోలీసులు కేసును సీరియస్ గా తీసుకుని సదరు నిందితులు ముగ్గురూ ఆ బంగారాన్ని అమ్మేందుకు వెళ్తున్న సమయంలో పట్టుకుని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపర్చనున్నట్టు మీడియాకు వెల్లడించారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన ఆటో, కత్తి, మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఓవైపు తండ్రి అనారోగ్యానికి పరిష్కారం కనుక్కునేందుకు కాలికి బలపం కట్టి ఆసుపత్రుల చుట్టూ తిరిగిన కూతురు.. చివరకు దేవుడిపై భారం వేసి బాబాలను సంప్రదించే క్రమంలో.. దొంగతనాల కోసం దేనికైనా తెగించే దుండగుల బారిన పడి తానే లేకుండా పోయిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :