జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్ : తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలను భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రులు పంపించారు. 3 నుంచి -7వ తరగతి వారికి రూ.1200, 8- నుంచి10వ తరగతి చదివే వారికి రూ.1400, ఇంటర్ విద్యార్థులకు 1875 రూపాయల డైట్ చార్జీలను పెంచాలని మంత్రులు ప్రతిపాదించారు. దాదాపు 25 శాతానికిపైగా డైట్ చార్జీలను పెంచాలని నిర్ణయించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకన్నా అత్యధిక డైట్ చార్జీలు తెలంగాణలోనే ఉండాలని నిర్ణయించారు. సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలపై ఉన్నతాధికారులతో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ భేటీ.. పలు నిర్ణయాలు తీసుకున్నారు.
Admin