Saturday, 18 May 2024 10:36:18 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రఘునందన్

Date : 18 December 2022 01:20 AM Views : 180

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు రాజకీయ సవాళ్లకు దారితీస్తున్నాయి. ఈడీ నోటీసులు వచ్చిన రోహిత్‌రెడ్డి చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అక్కడి నుంచే బండి సంజయ్‌కు సవాళ్లు విసిరారు. తనకు డ్రగ్స్‌ కేసులో నోటీసులు వచ్చినట్లు కానీ, FIRలో తన పేరు ఉన్నట్లు కానీ నిరూపించాలని ఛాలెంజ్‌ చేశారు. 24 గంటల్లో ఆధారాలు తీసుకుని భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు రోహిత్‌రెడ్డి. అయితే, రోహిత్ రెడ్డిపై ఎదురు దాడికి దిగారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. డ్రగ్స్‌ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న రోహిత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తానని అన్నారు. ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారని ఆయన ఆరోపించారు. నిజంగా డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి సంబంధం లేదని, డ్రగ్స్ ఎప్పుడూ ముట్టలేదని ప్రమాణం చెయ్యాలని సవాల్ చేశారు రఘునందన్. అసలు దేవుడుపై నమ్మకం లేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఈ ప్రమాణాల సవాళ్లేంటని ప్రశ్నించారు. నందు, సోమయాజులతో రోహిత్ రెడ్డికి ఎన్నేళ్ల నుంచి సంబంధాలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు రఘునందన్. వాళ్లతో సంబంధాలున్నాయని, కేసీఆర్‌‌కు తెలుసా.. తెలీదా? అని ప్రశ్నించారు. ఎంఐఎం గుండాలని అడ్డం పెట్టుకొని సంపాదించిన ఆస్తుల సంగతేంటని ప్రశ్నించారు రఘునందన్.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :