Saturday, 18 May 2024 10:28:21 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నందకుమార్‌హోటల్‌ను కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు

Date : 13 November 2022 07:44 PM Views : 197

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక నిందితుడు అయిన నందకుమార్‌కు బిగ్ షాక్ ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. నందకుమార్‌కు చెందిన డెక్కన్ కిచెన్...ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక నిందితుడు అయిన నందకుమార్‌కు బిగ్ షాక్ ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. నందకుమార్‌కు చెందిన డెక్కన్ కిచెన్ హోటల్‌లోని కొంత భాగాన్ని కూల్చివేశారు అధికారులు. అక్రమ నిర్మాణం పేరుతో ఈ చర్యకు ఉపక్రమించారు జీహెచ్ఎంసీ అధికారులు. హోటల్‌లోని కొంత భాగం అక్రమంగా నిర్మించారని, దీనికి సంబంధించి ఇదివరకే నోటీసులు అందజేశారు అధికారులు. దీనిపై నందకుమార్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దాంతో అధికారులు కూల్చివేత చేపట్టారు. తాము పంపిన నోటీసులకు స్పందించలేదని, అందుకే అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని జీహెఎచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.అయితే, ఆదివారం నాడు సెలవు అయినప్పటికీ.. అధికారులు అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతకు దిగడం విమర్శలకు దారి తీసింది. ఆదివారం రోజు హోటల్‌ను ఎలా కూరుస్తారంటూ అధికారులను ప్రశ్నించారు నందకుమార్ భార్య చిత్రలేఖ. గతంలో నోటీసులు ఇస్తే లీజు అగ్రిమెంట్ చూపించామని అంటున్నారు. ఈ లీజుపై దగ్గుబాటి ఫ్యామిలీ ఫిర్యాదు చేసిందని, అందుకే ఆదివారం పూట కూల్చివేస్తున్నారని మండిపడ్డారామె. ఈ ప్రశ్నలు, విమర్శలపై స్పందించిన అధికారులు క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా ఆదివారాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని గుర్తు చేశారు అధికారులు.ఇకపోతే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభాలకు గురి చేస్తూ నందకుమార్ సహా మరో ఇద్దరు వ్యక్తులు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :