Saturday, 18 May 2024 12:36:40 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ఏపీకా? తెలంగాణకా? హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ!

Date : 20 January 2023 10:36 AM Views : 200

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ సహా మొత్తం 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏ రాష్ట్ర కేడర్ అవుతారనే దానిపై ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది హైకోర్టు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఈ 11 మంది కేంద్ర సర్వీసు అధికారులకు ఏపీ కేడర్ ఖరారైంది. కానీ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వీరంతా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌‌లో అప్పీల్ చేసుకున్నారు. తెలంగాణలో పనిచేసేలా అప్పుడు క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారం ఇవాళ కొలిక్కి రాబోతోంది. ఇటీవలే సోమేశ్ కుమార్‌ను ఏపీ కేడర్‌గా ప్రకటించి, గతంలో క్యాట్ వెలువరించిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఏపీకి బదిలీ చేసింది.హైకోర్ట్. ఈ నేపథ్యంలో ఇవాళ ఎలాంటి తీర్పు రాబోతుందనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్.. ఇక్కడే ఉంటారా లేక ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయా అనేది ఆసక్తిగా మారింది. ఈ 11 మందిలో 9 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉండగా.. వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి సహా పలువురు అధికారులు ఉన్నారు. ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారించిన హైకోర్టు.. ఏపీకి వెళ్లాల్సిందిగా సోమేష్‌ కుమార్‌ను ఆదేశించింది. దాంతో ఆయన ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక 11 మంది ఐఏఎస్ అధికారుల వంతు వచ్చింది. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :