జై భీమ్ టీవీ - తెలంగాణ / : అశోక్ నగర్లోని హాస్టల్లో వరంగల్కు చెందిన ప్రవళిక అనే యువతి శుక్రవారం సాయంత్రం 8:30 ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను రాసిన సూసైడ్ లెటర్ లో తన కుటుంబానికి భారం కాదల్చుకోవట్లేదని, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, నన్ను క్షమించాలంటూ రాసింది. అయితే ప్రవల్లిక ఆత్మహత్యకు రద్దయిన టిఎస్పిఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్ ఏ కారణం అంటూ ఆందోళన మొదలైంది. నిన్న రాత్రి వందలాదిమంది విద్యార్థులు నిరుద్యోగులు ప్రవళిక హాస్టల్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. మధ్యరాత్రి వరకు పరిస్థితి ఉధృతంగా మారింది. ఇక ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్య అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ధ్వజమెత్తింది. పలువురు కాంగ్రెస్ నేతలు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. గురువారం జరిగినటువంటి సంఘటన నిరుద్యోగ యువతి ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య ఎందుకంటే తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ప్రభుత్వం వైఫల్యమే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గత తొమ్మిది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడంలో వైఫల్యం అయ్యిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లను టీఎస్పీఎస్ ద్వారా పరీక్షలు నిర్వహించడంలో కూడా విఫలమయ్యారు. పరీక్షల తేదీలను నిర్ణయిస్తూ పదేపదే వాయిదాలు వేస్తూ పెట్టిన పరీక్షలకు పేపర్ లీకులు చేస్తూ ఇలాగా అన్ని విషయాల్లో విఫలం చెందారు. నిరుద్యోగ యువత యువకులు విద్యార్థులు తల్లిదండ్రులకు భారమై దూర ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్ నగరంలో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ప్రతిసారి పరీక్ష రాసి మళ్ళీ అవి రద్దు అయి మళ్ళీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ హాస్టల్లో ఉంటూ తల్లిదండ్రులకు భారమై పరీక్షలు వాయిదా పడడంతో మనస్థాపన గురవుతున్నారు ప్రవల్లిక ఆత్మహత్య కూడా ఇదే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదం తో తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు నియామకాల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని, ఈసారి ఎన్నికల్లో తెలంగాణ టిఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ అంటుంది.
Admin