Saturday, 18 May 2024 01:41:56 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

సిట్టింగులను మార్చే యోచనలో ఎంఐఎం.. ఆశావహులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌

Date : 27 October 2023 10:49 AM Views : 68

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీల్లో టిక్కెట్ల పంచాయితీలు నడుస్తున్నాయి. సీట్ల కేటాయింపులు, అభ్యర్థుల ఎంపికల్లో నిమగ్నమయ్యాయి. దశల వారీగా లిస్ట్‌లు రిలీజ్‌లు చేస్తున్నాయి. ఇదంతా కామన్‌.. బట్‌.. ఇప్పుడు.. ఎంఐఎం వంతు కూడా వచ్చింది. కూల్‌గా సాగిపోయే ఎంఐఎం పార్టీలోనూ అభ్యర్థులను మార్చాలనే నిర్ణయం.. ఆ పార్టీ సిట్టింగుల్లో కంగారు పుట్టిస్తోంది. ఇంతకీ.. సిట్టింగ్‌లను మార్చాలని ఎంఐఎం ఎందుకు డిసైడ్‌ అయింది?.. అదే జరిగితే.. ఎంఐఎంలో ఆ సిట్టింగుల దారెటు? అన్నదీ ఇప్పడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ ‌టాపిక్‌గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులు, అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎంఐఎం కూడా ఇప్పటికే గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక పనిలో నిమగ్నమైంది. అయితే.. ఎంఐఎంకు కంచుకోటలుగా ఉన్న హైదరాబాద్‌లోని పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని యోచించడం హాట్‌ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని చార్మినార్‌, యాకుత్‌పురా, నాంపల్లి నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చాలని ఎంఐఎం భావిస్తోంది. అయితే.. చార్మినార్‌ స్థానంపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. చార్మినార్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ 1994 నుంచి యాకుత్‌పురాలో వరుసగా గెలుస్తూ వచ్చారు. కానీ.. గత ఎన్నికల్లో ఆయన్ను చార్మినార్‌ నుంచి బరిలోకి దించారు. యాకుత్‌పురాలో వ్యతిరేకతతోపాటు పలు ఆరోపణలు రావడంతో ఖాన్‌ను చార్మినార్‌ నుంచి పోటీ చేయించగా అక్కడ కూడా భారీ మెజార్టీతో గెలిచారు. వాస్తవానికి.. తొలిసారి యాకుత్‌పురా నియోజకవర్గంలో ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ఎంబీటీ నుంచి పోటీ చేసి గెలిచాక ఎంఐఎంలో చేరారు. అయితే.. గత ఎన్నికల్లో ఆయనకు చార్మినార్‌ కేటాయించడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యే అహ్మద్‌ పాషా ఖాద్రి యాకుత్‌పురా నుంచి బరిలో దిగి విజయం సాధించారు. ఇప్పుడు అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన్ను పక్కన పెట్టాలని ఎంఐఎం నిర్ణయించింది. ఆ స్థానంలో మరొకరిని పోటీ చేయించాలని చూస్తోంది. అలాగే.. చార్మినార్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ను కూడా మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. అక్బరుద్దీన్‌.. అహ్మద్‌ఖాన్‌ను కలిసి దాదాపు మూడు గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. చార్మినార్‌ బరి నుంచి తప్పుకోవాలని కోరారు. సుదీర్ఘకాలం పనిచేశారని, తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలని నచ్చచెప్పగా.. అహ్మద్‌ఖాన్‌ మాత్రం ససేమిరా అనడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అంతేకాదు.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రజాసేవలో మరికొంతకాలం కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ.. తనకు ఇవ్వకపోతే.. ఫ్యామిలీలోని ఒకరికి టిక్కెట్‌ ఇవ్వాలని అహ్మద్‌ఖాన్‌ కోరినట్లు ఎంఐఎం పార్టీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఇదిలావుంటే.. ఎంఐఎం చరిత్ర ఓసారి పరిశీలిస్తే.. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే టికెట్‌ కేటాయించే అనవాయితీ ఉంది. అనివార్య కారణాలతో ఎమ్మెల్యేలను మార్చితే.. మళ్లీ ఆ స్థానంలో కొత్తవారికి మాత్రమే అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే.. నాంపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యేని యాకుత్‌పురాకి మార్చి.. నాంపల్లి, చార్మినార్‌లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించాలని ఎంఐఎం భావిస్తోంది. అయితే.. మిగతా స్థానాల్లో అన్ని బాగానే ఉన్నా.. చార్మినార్‌ స్థానంలో మాత్రం అహ్మద్‌ఖాన్‌ అడ్డం తిరిగారు. అయితే.. ఫైనల్‌ చేసేది.. ఓవైసీ బ్రదర్స్‌ కావడంతో.. వారు ప్రకటన చేసే వరకు ఆశావహులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ పుడుతోంది. మొత్తంగా.. మార్పులు-చేర్పుల వ్యవహారంలో ఎంఐఎంకి పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ.. అహ్మద్‌ఖాన్‌ విషయంలో సీన్‌ రివర్స్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో.. ఎంఐఎం హైకమండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :