Saturday, 18 May 2024 09:22:39 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఎంత బిజీగా ఉన్నా ఆ రుచే వేరు.. దాబాలో చాయ్ తాగిన సీఎం కేసీఆర్.. నేతలతో మాటామంతి..

Date : 18 October 2023 10:47 AM Views : 72

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజాక్షేత్రంలో బీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తునే.. ప్రజలకు హామీలను గుప్పిస్తున్నారు గులాబీ బాస్‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. వరుసగా మూడో రోజు సీఎం కేసీఆర్‌ రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సిద్దిపేటతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు కేసీఆర్‌. ఓట్ల కోసం మోసపూరిత మాటలు చెబుతూ అనేక మంది వస్తారని.. కాంగ్రెస్‌తో పెద్ద ప్రమాదం పొంచి వుందన్నారు‌. సిరిసిల్ల, సిద్దిపేట బహిరంగ సభల్లో మాట్లాడిన గులాబీ దళపతి పొలిటికల్‌ పంచ్‌లతో విపక్ష పార్టీలపై ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రజాక్షేత్రంలో బీఆర్‌ఎస్‌ దూసుకుపోతోంది. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తునే.. ప్రజలకు హామీలను గుప్పిస్తున్నారు గులాబీ బాస్‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. వరుసగా మూడో రోజు సీఎం కేసీఆర్‌ రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సిద్దిపేటతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు కేసీఆర్‌. ఓట్ల కోసం మోసపూరిత మాటలు చెబుతూ అనేక మంది వస్తారని.. కాంగ్రెస్‌తో పెద్ద ప్రమాదం పొంచి వుందన్నారు‌. సిరిసిల్ల, సిద్దిపేట బహిరంగ సభల్లో మాట్లాడిన గులాబీ దళపతి పొలిటికల్‌ పంచ్‌లతో విపక్ష పార్టీలపై ఫైర్ అయ్యారు. కుమారుడు కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్లకు ఎమ్మెల్యేగా కేటీఆర్‌ ఉండటం ఈ ప్రాంత వాసుల అదృష్టమని అన్నారు. సిరిసిల్లలోని చేనేత కార్మికుల బతుకులు మార్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. తిరిగి అధికారంలోకి వస్తే సిరిసిల్ల వాసులు కోరుకుంటున్నట్టుగా సిరిసిల్లను మరో సోలాపూర్‌గా మార్చుతామని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. నేత కార్మికుల బతుకులు బాగుచేసేందుకు బతుకమ్మ చీరలు తెచ్చామని సీఎం కేసీఆర్‌ అన్నారు. వాటిని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. సిరిసిల్ల నుంచి హెలికాప్టర్‌లో సిద్దిపేట వచ్చిన సీఎం కేసీఆర్‌ అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. తనను నాయకుడిని చేసిన సిద్దిపేట రుణం తీర్చుకోలేనిదని సీఎం అన్నారు. తన సన్నిహితులను పేరు పేరునా గుర్తు చేసుకున్నారు. తాను వెళ్లినా సిద్ధిపేటకు ఆరుడగుల బుల్లెట్‌ ను అప్పగించానంటూ కేసీఆర్ హరీష్‌రావును కొనియాడారు. సిద్ధిపేట ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట బహిరంగ సభ నుంచి హైదరాబాదుకు వస్తూ మార్గ మధ్యలోని సోనీ ఫ్యామిలీ దాబాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాయ్ తాగారు. కొన్ని నిమిషాల పాటు కాన్వాయ్ ను ఆపిన సీఎం కేసీఆర్ టీ తాగుతూ సేద తీరారు.. సీఎం కేసీఆర్.. మంత్రి హరీష్ రావు, రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు, ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులతో మాట్లాడుతూ.. కాసేపు గడిపారు. దాబాలో కాసేపు ఆగి చాయి తాగిన సీఎం కేసీఆర్.. అనంతరం హైదరాబాద్ పయనమయ్యారు. అయితే, తొలి విడత ప్రచారాన్ని రేపు జడ్చర్ల, మేడ్చల్‌ సభలతో సీఎం కేసీఆర్‌ ముగించనున్నారు. దసరా తర్వాత తిరిగి బహిరంగసభల్లో పాల్గొననున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :