జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ జై భీమ్ ప్రతినిధి : వాహన మరమ్మత్తులలో జాప్యాన్ని నివారించాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లలో వాహన మరమ్మత్తులు వాటి స్థితిగతులపై ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సమీక్ష నిర్వహించి సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వాహన స్థితి గతులపై ఈఈ వివరణ ఇస్తూ ప్రస్తుతం మన వద్ద ఉన్న వాహనాలలో 03 హెచ్ఎంటి ట్రాక్టర్లు పూర్తిస్థాయిలో రిపేరింగ్ లో ఉన్నాయని మరో 05 ట్రాక్టర్లు కండెం (విచ్ఛిన్న) దశకు చేరుకున్నాయని, 02 కంప్రెసర్ లు, 07 డంపర్ ప్లేసర్లు, 04 టిప్పర్లు, 04 జెసిబి లు, 01 డోజర్, 03 స్వచ్చ ఆటో లు 02 రోబో లు,3 స్వ్వీపింగ్ మిషన్ లు రిపేరింగ్ దశలో ఉన్నాయని, 01 డోజర్ కండెం దశలో ఉందని, హిటాచీలను సర్వీసింగ్ కి పంపాల్సిన ఆవశ్యకత ఉందని, హిటాచి వాహనాన్ని ఇరాడికల్ సర్వీసెస్ ప్రాసెస్ లో భాగంగా చైన్ మార్చాల్సిన అవసరం ఉందని ఇందుకోసం రోబో ల మరమ్మత్తులకు సర్వీస్ నిర్వహించే వ్యవస్థ నగరం లో లేదని, జీ. డబ్యు.ఎం.సి లో వివిధ రకాల మొత్తం వాహనాలు 552 ఉన్నాయని, మిగితా వాహనాలు యదావిధిగా గా పనిచేస్తున్నాయని తెలుపగా మేయర్ నగర అవసరాల దృష్ట్యా కొత్త టాక్టర్లు, మొబైల్ టాయిలెట్స్ కొనడానికి గల అవకాశాలను పరిశీలించాలని, సూపరిండెంట్ ఇంజనీర్ వాహన షెడ్డును క్షేత్రస్థాయిలో తనిఖీ జరపాలని ఈ సందర్భంగా మేయర్ అన్నారు. అంతకుముందు హన్మకొండ లోని బాలసముద్రంలోని బల్దియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెహికల్ షెడ్డు ను మేయర్ క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి కొనసాగుతున్న వాహన మరమ్మత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వాహన మరమ్మతులలో జాప్యం వల్ల నగరంలో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయే అవకాశం ఉన్నందున, రిపేర్ కోసం షెడ్డు కు వచ్చే వాహనాలను ఎప్పటికప్పుడు రిపేర్ చేసి పంపించాలని అన్నారు. ఈ సందర్భంగా మరమ్మత్తుల కోసం వచ్చిన వాహనాల నమోదు రిజిష్టర్ ను మేయర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ.కృష్ణారావు డిసిలు శ్రీనివాస రెడ్డి, జోనా, ఈఈ సంజయ్ కుమార్, ఏ ఈ సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు
Admin