Saturday, 18 May 2024 09:22:39 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మహారాష్ట్ర, కర్ణాటక ఊళ్లు తెలంగాణల కలుస్తమంటున్నయ్​ : మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్

Date : 20 December 2022 02:46 PM Views : 209

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కేజీబీవీ పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పలు హామీలిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రూ.3 కోట్ల 50 లక్షలతో నూతనంగా నిర్మించిన KGBVని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. kgbvకి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని, పాత జూనియర్ కళాశాల భవనం స్థానంలో కొత్త జూనియర్ కళాశాల భవనాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చారు. రూ.2 కోట్లతో రుద్రంగిలో రోడ్లు అభివృద్ధి చేసి లైటింగ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. రుద్రంగిలో ఫిబ్రవరిలో 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తామన్నారు. సీఎం కేసిఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు నాయకత్వంలో అద్భుత ఆధ్యాత్మిక పట్టణంగా వేములవాడ టెంపుల్, పట్టణం అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్లలో విద్యారంగ వికాసానికి రూ. 123 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రకు చెందిన 14 గ్రామాల సర్పంచ్ లు, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ ప్రజలు తమ ఊళ్లను తెలంగాణలో విలీనం చేసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. ‘2014కు ముందు 29 లక్షల మందికి పెన్షన్ లు వచ్చేవి. ఇప్పుడు పెన్షన్ మొత్తాన్ని పది రెట్లు పెంచి 46 లక్షల మందికి అందిస్తున్నాం. 2014 కు ముందు మనిషి సచ్చిపోతే కరెంట్ కోసం అధికారులను ప్రాధేయ పడాల్సి వచ్చేది. దేశంలో 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. తెలంగాణలో 64 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 9 విడతలకు జమ చేశాం. త్వరలోనే రైతు బంధు రూపంలో 7600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఎవ్వరేమన్న .. ప్రజల ఆశీస్సులు తమపై ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తాం. మాకంటే రెండు పనులు ఎక్కువ చేసి ప్రజల మనసు గెలుచుకొండ్రి’ అని కేటీఆర్​ వ్యాఖ్యానించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ అరుణ రాఘవ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

JAI BHEEM TV

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :