Saturday, 18 May 2024 09:42:11 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేడు తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు..

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పోలీసుల అలర్ట్

Date : 27 December 2022 10:20 AM Views : 174

జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఇవాళ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి మావోయిస్టు పార్టీలు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా టేకమెట్ట అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ కు నిరసనగా బంద్ పిలుపునిచ్చారు. బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ ప్రజలంతా బంద్ లో భాగస్వామ్యం కావాలన్నారు. మావోయిస్ట్‌ల బంద్‌ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ములుగు, భూపాలపల్లి ఏజెన్సీల్లో భారీగా మోహరించారు. చత్తీస్‌గడ్‌- తెలంగాణ , మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెంచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పోలీసులు నిఘా పెట్టారు. రంగంలోకి దిగిన స్పెషల్‌ పార్టీ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్ట్‌ల హిట్‌ లిస్ట్‌లో ఉన్న వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదిలావుంటే.. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు కంతి లింగవ్వ అలియాస్ అనిత మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పట్లో పీపుల్స్ వార్ పార్టీ ఇక్కడి మారుమూల పల్లెలో సమాంతర వ్యవస్థ నడిపించిన సమయంలో దళంలో సభ్యుడుగా కొనసాగుతున్న మైలారం అడెల్లు అలియాస్ భాస్కర్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మెంబర్ గా, ఏరియా కమిటీ మెంబర్‌గా ఉన్న ఆమెపై చత్తీస్ గఢ్​ప్రభుత్వం రూ. 16 లక్షల రివార్డు ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షల రివార్డు ప్రకటించింది. అయితే లింగవ్వ పార్టీ కార్యకలాపాల విస్తరణలో భాగంగా రిక్రూట్మెంట్ లపై ఎక్కువ దృష్టి సారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్​సరిహద్దు ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణ కోసం సమావేశమయ్యారు. అదే సమయంలో పోలీసులు వీరిని చుట్టుముట్టి ఎదురుకాల్పులు జరపడంతో కంతి లింగవ్వ తోపాటు మరో వ్యక్తి మరణించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :