Saturday, 18 May 2024 11:37:57 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రూమ్ షేరింగ్‌కు ఓఎల్‌ఎక్స్ ప్రకటన ఇచ్చిన యువకుడు.. వచ్చిన మహిళ వేశ్య అని తెలియడంతో..!

Date : 17 November 2023 09:26 AM Views : 97

జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్‌కి కొత్తగా వచ్చిన వాళ్లు ఎవరైనా పీజీ హాస్టల్స్‌లో ఉండాల్సిందే. లేకుంటే షేరింగ్ రూమ్స్‌ దొరికితే అందులో ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు. కొందరు ఇంటర్వూల కోసం రోజుల వారీగా ఉంటే.. మరికొందరు నెలల తరబడి ఉంటారు. అయితే ఈ హాస్టల్స్‌లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ పరిధిలోని వెంగళరావు నగర్ మధురానగర్‌లో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిరణ్ కుమార్ రూం అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఏడాది కాలంగా ఇక్కడే నివసిస్తున్నారు. తనతోపాటూ ఎవరైనా రూం షేర్ చేసుకుంటే బాగుంటుందనుకొని ఓఎల్ఎక్స్‌ వేదికపై ప్రకటన ఇచ్చారు. అందులో అతని కాంటాక్ట్ నంబర్ ఇవ్వడంతో ఒక మహిళ ఆసక్తిచూపి ఫోన్ చేసింది. ఆ రూమ్‌ను ఇచ్చేందుకు సిద్దమైయ్యాడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కొన్ని రోజుల తరువాత కూకట్‌పల్లికి వెళ్లిన కిరణ్ కుమార్‌తో ఆ మహిళ వేశ్య అని చెప్పడంతో అద్దెకు ఇచ్చిన గదిని ఖాళీ చేయమన్నారు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి సన్నిహితంగా ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించింది. ఆపై షీ టీం ను ఆశ్రయించి తనపై లైంగిక దాడి చేశాడంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తరువాత కిరణ్ వద్ద నుంచి రూ. 4.7 లక్షలు పరిహారంగా తీసుకుంది. డబ్బులు తీసుకొని కూడా ఇద్దరూ చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన కిరణ్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. కంప్లైంట్ తీసుకొని ఆ ఫోటోలను సామాజిక మాధ్యమ అకౌంట్ల నుంచి తొలగించారు. ఇంతటితో ఆగకుండా మరింత దారుణానికి ఒడిగట్టింది ఆ వేశ్య మహిళ. పోలీసులకు తనపై ఫిర్యాదు చేశాడని ఈ నెల 13న రాత్రి 9గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులతో కిరణ్‌పై దాడి చేయించింది. తనపై జరిగిన దాటిని ఖండిస్తూ బుధవారం రాత్రి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :