జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈడీ దాఖలు చేసిన కొత్త చార్జ్షీట్లోనూ ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటంతో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. Delhi Liquor Scam Case: రాజ్గోపాల్ అన్న తొందరపడకు, మాట జారకు.. ఎమ్మెల్సీ కవిత కౌంటర్..Mlc Kavitha ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈడీ దాఖలు చేసిన కొత్త చార్జ్షీట్లోనూ ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటంతో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ తరుణంలో కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, కవిత మధ్య ట్విట్వార్ మొదలైంది. లిక్కర్ క్వీన్ అంటూ రాజగోపాల్రెడ్డి ట్వీట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఛార్జ్షీట్లో 28 సార్లు కవిత పేరు ఉందని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా, రాజ్గోపాల్రెడ్డి ట్వీట్కి ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. రాజ్గోపాల్ అన్న తొందరపడకు, మాట జారకు.. అంటూ సూచించారు. 28 సార్లు లేదా 28 వేల సార్లు చెప్పించినా…అబద్ధం నిజం కాదంటూ కవిత ట్వీట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో చార్జ్షిట్ లో కవిత పేరు రావడంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సైతం ట్విట్ చేశారు. ఇవ్వాల్సిన వివరణలు చాలా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. దీనిపై కూడా కవితా స్పందించారు. ‘‘నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమైనవి.. అబద్ధం.. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుంది. బీజేపీ రైతు వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల విధానాలను బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ బహిర్గతం చేస్తారనే భయంతో బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మళ్లీ కవిత పేరు చేర్చడంపై గులాబీ శిబిరం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. కాగా.. మళ్లీ పేరు చేర్చడంపై ఎమ్మెల్సీ కవిత న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్తో భేటీ అయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం. రెండో చార్జ్షీట్లో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దాఖలు చేసిన కొత్త చార్జ్షీట్లోనూ ఎమ్మెల్సీ కవిత తో పాటు, ఏపీ మాగుంట పేర్లు చేర్చింది. సమీర్ కంపెనీలో కవితకు 32శాతం వాటా ఉన్నట్లు అభియోగం మోపింది. సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్లో ఎమ్మెల్సీ కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మూత్తం గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ రావు పేర్లు ఉన్నాయి. ఒబారాయ్ హోటల్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసినట్టు ఈడీ విచారణలో పేర్కొన్నారు సమీర్ మహేంద్రు. శరత్ చంద్ర రెడ్డి, అభిషేక్, బుచ్చిబాబు ఢిల్లీ ఒబారాయ్ హోటల్ సమీర్ మహేంద్రు కలిసినట్టు ఈడీ ఛార్జ్ షీట్లో పేర్కొంది. అనంతరం నలుగురు కలిసి శరత్ చంద్రా రెడ్డికి సంబంధించిన ప్రత్యేక విమానం(చార్టెడ్ ఫ్లైట్)లో హైదరాబాద్ వెళ్లినట్టు ఈడీ చార్జ్ షీట్లో పేర్కొంది. అలాగే, ఇండో స్పీరిట్స్లో ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కవిత కు వాటా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్స్ కి రూ. 192.8 కోట్లు లాభం వచ్చిందని, ఇదంతా నేరపూరితమైన మార్గంలో వచ్చినట్టు పేర్కొంది ఈడీ. ఇక శరత్ చంద్రారెడ్డి చేతుల్లో ఐదు రిటైల్ జోన్లను అభిషేక్ రావు నడిపిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. కాగా, కవిత వాడి ధ్వంసం చేసిన పది ఫోన్ల వివరాలను ఈడీ సమీర్ మహేంద్రు చార్జ్షీట్లో వివరించింది.
Admin