జై భీమ్ టీవీ - తెలంగాణ / : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తిరిగి కాంగ్రెస్లో చేరనుండడంతో మునుగోడులో కొత్త రచ్చ మొదలైంది. అక్కడ పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే రాజగోపాల్రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిన పాల్వాయి స్రవంతి.. ఈసారి కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ఉప ఎన్నికలో స్రవంతికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ సారి తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీ నేతలను కోరుతున్నారు. దీంతో మునుగోడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. గత ఏడాది ఆగస్ట్లో కాంగ్రెస్కి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేశారు. బీజేపీలో చేరేముందే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసి 10 వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల చేతిలో ఓడిపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి మునుగోడు టిక్కెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి మునుగోడు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశామని.. టికెట్ తమకే ఇవ్వాలని పాల్వాయి స్రవంతి, చల్లమల కృష్ణారెడ్డి కోరుతున్నారు. పార్టీ మారి వచ్చే వారికి టికెట్ ఇస్తే కార్యకర్తల ఆగ్రహానికి గురి కాక తప్పదంటున్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తే.. కాంగ్రెస్ క్యాడర్ సహకరిస్తుందా..? మునుగోడు సీటు CPIకి ఇవ్వకపోతే నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బదిలీ అంత ఈజీ కాదని CPI నేతలు చెప్తున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక.. పార్టీకి లాభం చేస్తుందా.. నష్టం చేస్తుందా..? పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డిలను అధిష్టానం బుజ్జగిస్తుందా..? పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి వ్యూహం ఎలా ఉంటుందనేది చూడాలి.
Admin