Saturday, 18 May 2024 10:36:19 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కరీంనగర్‌లో కీలకం కానున్న కాపుల ఓట్లు.. పోటీలో ముగ్గురు బీసీ అభ్యర్ధులు

Date : 11 November 2023 03:51 PM Views : 70

జై భీమ్ టీవీ - తెలంగాణ / : కరీంనగర్ అసెంబ్లీ బరిలో ముగ్గురు ప్రధాన అభ్యర్థులు మున్నూరు కాపులే ఉండటం గమనార్హం. ఇక్కడ బీసీ వాదంతో ముందుకు వెళ్తున్నయి ప్రధాన పార్టీలు. కరీంనగర్‌లో ముస్లీం, మున్నూరు కాపుల ఓట్లు కీలకం కానున్నాయి. వేలుమ సామాజికవర్గం ఇలాకలో మూడు సార్లు గెలిచి హాట్రిక్ కొట్టారు గంగుల కమలాకర్. ఇప్పుడు మూడవసారి ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తున్నారు బండి సంజయ్. సర్పంచ్‌గా కొనసాగుతూ ఇద్దరు సీనియర్లతో సై అంటున్నారు పురుమల్ల శ్రీనివాస్. అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వర్గాల వారిగా ఓట్లు ఎంతో కీలకం కానున్నాయి. రాజకీయ పార్టీలు టికెట్ ఇచ్చేటప్పుడు కులాల సమీకరణాల వారిగా టికెట్లు కేటాయిస్తుంటారు. ఒక పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందిన వారికీ టికెట్ ఇస్తే మరో పార్టీ మరో బలమైన అభ్యర్థికి టికెట్ కేటయిస్తుంది. కానీ కరీంనగర్ అసెంబ్లీలో మూడు ప్రధాన పార్టీలు మున్నూరు కాపు సామజిక వర్గానికే కేటాహించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఓటింగ్ సమయానికి మున్నూరు కాపులు ఎవరి పక్షాన నిలుస్తారన్నది ఆసక్తిగా మారింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేల పోరు ఇప్పుడు మున్నూరు సామాజికవర్గ పోరుగా మారింది. ఇప్పటికే కరీంనగర్ రూరల్ మండలానికి జడ్పిటిసి సర్పంచ్‌గా పనిచేసిన పురుమల్ల శ్రీనివాస్ బరిలో నిలుస్తున్నారు. గతంలో వెలుమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో ఇప్పుడు మున్నూరు కాపుల ప్రాభల్యం పెరిగింది. అందుకే మూడు ప్రధాన పార్టీలు ముగ్గురు మున్నూరు కాపులకే తమ టికెట్లు కేటాయించాయి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు లక్షల నలబై వేల ఓటర్లు ఉండగా ఇందులో ప్రధానంగా గెలుపోటములు నిర్నహించేది మున్నూరు కాపులు, ముస్లిం ఓటర్లే. ముస్లిం ఓటర్లు దాదాపుగా అరవై వేల పైచిలుకు ఉండగా.. మున్నూరు కాపుల ఓట్లు కూడా అటు ఇటుగా అదే స్థాయిలో ఉన్నారు. ప్రధాన పార్టీలకి ఇప్పుడు ఈ రెండు సామజిక వర్గ ఓట్లే కీలకం కానున్నాయి. కరీంనగర్ టౌన్‌తో పాటుగా రూరల్ గ్రామాల్లో కూడా మున్నూరు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. లక్ష ఓట్లకి పైగా ఈ రెండు సామజిక వర్గ ఓట్లు ఉండడం‌తో అన్ని పార్టీలకి ఇవే కీలకం కానున్నాయి. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ అసెంబ్లీ బరి నుండి నాలగవ సారి బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు సార్లు గెలిచిన గంగుల కమలాకర్ కరీంనగర్‌లో రోడ్లు, కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్, ఐటి టవర్, మెడికల్ కాలేజ్, టిటిడి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఇవన్నీ తన నియోజకవర్గానికి తీసుకువచ్చానని ప్రచారం చేసుకుంటున్నారు. బండి సంజయ్ ఎంపిగా గెలిచి రూపాయి పని చెయ్యలేదని, పురుమల్ల శ్రీనివాస్ ఒక రౌడి షీటర్ అని తానూ గెలిస్తే కరీంనగర్‌లో భూములు ఖబ్జాకి గురి అవుతాయని గంగుల అంటున్నారు. బండి సంజయ్ ప్రధానంగా కేసీఆర్, కేటీఅర్‌లను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ వస్తున్నారు. Telangana: ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలు గ్రూప్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం వైపల్యం, సివిల్ సప్లై మంత్రిగా కొనసాగిన గంగుల కమలాకర్ తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపణలు చేస్తున్నారు. ఇక కరీంనగర్ నగర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటి ఫండ్స్‌తోనే అభివృద్ధి అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి గంగుల కరీంనగర్ నగర అభివృద్దికి చేసింది ఏమి లేదని బండి సంజయ్ అంటున్నారు. తాను ఎంపి‌గా గెలిచిన తరువాత కరీంనగర్ పార్లమెంట్‌కి నిధులు తీసుకువచ్చానని సంజయ్ అంటునే వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి తనకి అవకాశం ఇవ్వాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్‌, కరీంనగర్ రూరల్ మండలానికి జడ్పీటీసీగా, సర్పంచ్‌గా సేవ చేసానని తనని నమ్మి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని మంత్రి గంగుల కమలాకర్‌ని ఓడించడమే తన లక్ష్యం అని ప్రచారంలో దూసుకు పోతున్నారు. కరీంనగర్‌లోని మున్నూరు కాపు సామజిక వర్గంతో పాటుగా ముస్లిం మైనారిటీ‌లలో పురుమల్ల శ్రీనివాస్‌కి మంచి పట్టు ఉండడంతో తనకే మున్నూరు కాపులు, ముస్లీం ఓట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలే తనకి శ్రీరామ రక్షా అని, జనాలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని అంటున్నారు శ్రీనివాస్. కరీంనగర్ అసెంబ్లీకి ముగ్గురు కాపులే పోటీ పడుతుండడంతో కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోని మున్నూరు కాపులు ఎవరి పక్షాన నిలిచి చివరకు ఎవరికీ పట్టం కడుతారో చూడాలి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :