జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్ అశోక్నగర్లో ప్రవళిక అనుమానాస్పద మరణం సంచలనం రేపింది. సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టీ ఆత్మహత్యగా ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు. పోస్ట్మార్టమ్ తరువాత డెడ్బాడీని ప్రవళిక పేరెంట్స్కు అప్పగించారు. షాకింగ్ వార్త విని పల్లె కన్నీరైంది. స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కోజిపల్లిలో శోకసంద్రమైంది..బాధతప్త హృదయాలతో ప్రవళిక అంత్యక్రియలు నిర్వహించారు బంధుమిత్రులు, స్థానికులు. గ్రూప్ 1, 2 పోటీపరీక్షలు వాయిదా వేయడం వల్లే మనస్తాపంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. పర్సనల్ ఇష్యూస్ వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. హాస్టల్ రూమ్లో స్వాదీనం చేసుకున్న సూసైడ్ నోట్ ఆధారంగా శివరాం రాథోడ్పై కేసు నమోదు చేశారు. పెళ్లి విషయంలో ఆ ఇద్దరి మధ్య వివాదం వున్నట్టు గుర్తించారు పోలీసులు. తనకు మాటచ్చి మరోయువతితో శివరాం ఎంగేజ్మెంట్ చేసుకోవడం వల్లే ప్రవళిక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందన్నారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు. పక్కా ఎవిడెన్స్తో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోటీపరీక్షల వాయిదాకు ప్రవళిక ఆత్మహత్యకు ఎలాంటి సంబంధంలేని క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు డీసీపీ. కొందరు ప్రవళిక సూసైడ్ను అదునుగా చేసుకొని ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి గవర్నమెంట్ ఆస్తులు డ్యామేజ్ చేయడం, రాళ్లు రువ్వడం చేశారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే అభ్యర్థిని సూసైడ్ చేసుకుందని తోటి విద్యార్థులు చెప్పినా పట్టించుకోకుండా కొందరు ఆందోళనకు దిగారని ఆయన వెల్లడించారు. ప్రవళిక ఆత్మహత్య కేసులో అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు. అపోహాలను నమ్మోద్దని సూచించారు డీసీపీ వెంకటేశ్వర్లు.. మరోవైపు ప్రవళిక అర్ధాంతర మరణం ఆమె కుటుంబంలో తీరాన్ని శోకాన్ని మిగిల్చింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు బిక్కోజిపల్లి గ్రామస్తులు. ప్రవళిక మరణానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Admin