Saturday, 18 May 2024 10:28:13 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సంచలనం..

రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట పేర్లు

Date : 30 November 2022 08:57 PM Views : 189

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు మరో మలుపు తిరిగింది. రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది. అమిత్‌ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును వెల్లడించింది. Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సంచలనం.. రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట పేర్లు..Mlc Kavitha ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఓ వైపు అరెస్ట్‌లు కొనసాగుతున్న వేళ.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు మరో మలుపు తిరిగింది. రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది. అమిత్‌ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చింది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఈడీ రిపోర్టులో చేర్చింది. రూ. వంద కోట్లు అరేంజ్‌ చేసినవారిలో.. కవిత, ఎంపీ మాగుంట పేరు ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. పది సెల్‌ఫోన్లను డ్యామేజ్‌ చేసినట్టు.. రిమాండ్‌ రిపోర్టులో ఈడీ పేర్కొంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కాగా, అమిత్‌ అరోరాను ఇప్పటికే అరెస్ట్ చేసి ఈడీ పలుమార్లు విచారించింది. ఈ క్రమంలోనే కవిత పేరు రిమాండ్‌ రిపోర్ట్‌లో చేర్చడం హాట్‌ టాపిక్‌గా మారింది. లిక్కర్ స్కామ్‌ ఎపిసోడ్‌లో సౌత్ గ్రూప్‌ వంద కోట్ల ముడుపులు చెల్లించింది. వంద కోట్ల సమకూర్చిన వారిలో కవిత, మాగుంట పేర్లను చేర్చింది ఈడీ. గతంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ స్కామ్ తో సంబంధం లేనట్లు వెల్లడించారు. ఈ తరుణంలోనే వీరిద్దరి పేర్లను చేర్చడం రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :