Saturday, 18 May 2024 01:59:51 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్‏కు

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు

Date : 16 December 2022 02:16 PM Views : 175

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‏కు ఈడీ నోటీసులిచ్చింది. డ్రగ్స్ కేసులో భాగంగా ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక లావాదేవీల పై రోహిత్ కు నోటీసులిచ్చినట్లుగా తెలుస్తోంది. వీరు ఈనెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ అయ్యాయి. గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసు రాష్ట్రంలో కలకలం రేపింది. ఇందులో పలువురు సినీ తారల హస్తం ఇందులో ఉందనే వార్తలు కలకలం సృష్టించాయి. వారికి గతంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక మరోసారి ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఫామ్‌హౌస్‌ కేసులో ఇటీవలే రోహిత్‌రెడ్డి వాంగ్మూలం నమోదైంది. ఈ సమయంలోనే రోహిత్‌రెడ్డికి ఈడీ పిలుపుపై ఉత్కంఠ నెలకొంది. రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లోనే ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ జరిగింది. అలాగే గతంలో బెంగళూరు డ్రగ్స్‌కేసులో రోహిత్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి రోహిత్ వ్యాపార లావాదేవీలపై కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 2021లో బెంగళూరులోని గోవర్థనపుర పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కలహర్‌రెడ్డి అనే వ్యాపారవేత్తతో కలిసి బెంగళూరులో డ్రగ్స్‌ పార్టీకి రోహిత్‌రెడ్డి వెళ్లారని.. ఆ పార్టీ సినీనిర్మాత శంకర్‌గౌడ ఇచ్చారని సమాచారం. నైజీరియన్ల దగ్గరి నుంచి రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్‌ పార్టీకి చేరినట్టు తేల్చిన బెంగళూరు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌ తీసుకున్న మస్తాన్‌, శంకర్‌గౌడను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో ఈ కేసులో భాగంగా హీరో తనీష్‌ను బెంగళూరు పోలీసులు విచారించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :