Saturday, 18 May 2024 10:08:46 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అశోక్‌నగర్‌లో యువతి ఆత్మహత్య.. ప్రభుత్వమే కారణమంటూ అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..

Date : 14 October 2023 12:14 PM Views : 73

జై భీమ్ టీవీ - తెలంగాణ / : హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. ఆత్మహత్య చేసుకుంది. అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటూ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థిని ప్రవల్లిక రాత్రి సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. తనను క్షమించాలంటూ సూసైడ్ లెటర్ రాసింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున హాస్టల్ వద్దకు చేరుకున్నారు. యువతి మృతికి ప్రభుత్వమే కారణం అంటూ అర్థరాత్రి వేళ అశోక్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయడం వల్లే యువతి ఆత్మహత్య చేసుకుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ స్థాయిలో విద్యార్థులు రోడ్డు మీదకు రావడంతో.. అశోక్‌నగర్ ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులను ఈడ్చుకెళ్లారు పోలీసులు. దాంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వగా.. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇక ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ప్రభుత్వ అలసత్వం వల్ల వరుసగా పోటీ పరీక్షలు వాయిదా పడడంతోనే విద్యార్థిని కుంగిపోయిందని ఆరోపించాయి విద్యార్థి సంఘాలు. అటు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కూడా ఘటనాస్థలానికి వచ్చారు. బీజేపీ నేత లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ నేత విజయారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు పోలీసులు. అనంతరం భారీగా గుమిగూడిన విద్యార్థులను అక్కడి నుంచి చెదరగొట్టారు. పోలీసులు చెబుతున్న వెర్షన్ ఇదీ.. ప్రవల్లిక 15 రోజుల క్రితమే హాస్టల్‌కు వచ్చిందన్నారు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు. అప్పటి నుంచి ఎవరితో మాట్లాడకుండా ఉండేదన్నారు. నిన్న రాత్రి తన రూమ్‌మేట్స్‌ భోజనానికి వెళ్లిన సమయంలో సూసైడ్‌ చేసుకుందని చెబుతున్నారు. విద్యార్థులు చెబుతున్న వివరాలు.. మృతురాలు వరంగల్ జిల్లాకు దుగ్గొంది మండలం, బిక్కోజిపల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక(23)గా గుర్తించారు పోలీసులు. ప్రవల్లిక గత రెండు సంవత్సరాలుగా కాంపిటీటీవ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతోంది. గ్రూప్ – 2 కి అప్లై చేసిన ప్రవల్లిక.. అశోక్‌ నగర్‌లో గర్ల్స్ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటోంది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన గ్రూప్ 2 ఎగ్జామ్.. మళ్లీ వాయిదా పడటంతో ప్రవల్లిక తీవ్ర మనస్తాపానికి గురైంది. వేలకు వేలు డబ్బు పెట్టి కోచింగ్ తీసుకోవడం.. హాస్టల్‌లో ఉండి చదువుకోవడం భారంగా మారడంతో పాటు.. ఎగ్జామ్స్‌ మళ్లీ వాయిదా పడటంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో యువతి హాస్టల్‌లో రూమ్‌మేట్స్ భోజనం చేసేందుకు కిందకు వెళ్లగా.. తాను ఒక్కతే గదిలో ఉండి ఆత్మహత్యకు పాల్పడింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :