జై భీమ్ టీవీ - తెలంగాణ / వరంగల్ జిల్లా : వరంగల్ జై భీమ్ ప్రతినిధి : ఆత్మహత్యకు కారణమైన నిందితులను అరెస్టు చేయడంలో విఫలమైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలనీ ఎల్ హెచ్ పీ ఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ కిషన్ నాయక్ డిమాండ్ చేశారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో విలే కరుల సమావేశం సందర్భంగా జా టోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ డా ప్రీతి నాయక్ ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, తక్షణమే ప్రీతి నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రీతి నాయక్ లైంగిక వేధింపులతోనే, లైంగికంగా ఒప్పుకోకపోవడంతో నిందితులు హత్య చేసినట్టుగా మా అనుమానం ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిజ నిర్ధారణ చేయడం లేదని, కనీసం వరంగల్ పోలీసులు కూడా వాస్తవాలను బయటకి తెలపడం లేదని, ఇందులో కుట్రపూరితమైన నేరము దాగి ఉన్నదని, డాక్టర్ ప్రీతి నాయక్ మీద జాతి పరమైన వివక్షత కొనసాగిందని, దీనిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, ఇప్పటికే 40 రోజులు పైగా దాటుతున్న ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదని, టాక్సికాలజీ రిపోర్టులో మత్తు విష పదార్థాలు సేవించలేదని నివేదిక ఉన్నదని, అయిన కూడా డాక్టర్ ప్రీతి నాయక్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీక రిస్తున్నారని, తక్షణమే మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలను, తక్షణమే ఈ కేసును సిబిఐకి అప్పగించాలనీ డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రీతి నాయక్ కుటుంబానికి తక్షణమే 5 కోట్ల ఎక్స్ గ్రేశీయ నష్టప రిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి గ్రూపు వన్ ఉద్యోగం ఇవ్వాలనీ, డాక్టర్ ప్రీతి నాయక్ హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కేసు మొత్తంలో నిజనిర్ధారణ చేయాలని, డాక్టర్ ప్రీతి నాయక్ పేరిట ప్రత్యేకమైన ర్యాగింగ్ చట్టాలను ఏర్పాటు చేయాలన్నారు, తక్షణమే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి డాక్టర్ ప్రీతి నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని న్యాయమైన డిమాండ్ లు పరిష్కరించాలని, లేకుంటే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బానొత్ సునీల్ నాయక్ మంద కుమార్, డాక్టర్ బాదావత్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin