Saturday, 18 May 2024 01:42:02 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

చేతులు కలిపిన శుభవేళ..! ముత్తిరెడ్డి, పల్లా మధ్య సయోధ్య కుదిర్చిన మంత్రి కేటీఆర్..

Date : 11 October 2023 11:31 AM Views : 77

జై భీమ్ టీవీ - తెలంగాణ / : బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేసే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి అసంతృప్తుల జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యమంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు సీట్లు దక్కకపోవడంతో.. ఆయా ఎమ్మెల్యేలు ఇంతకాలం అసంతృప్తితో ఉన్నారు. హైదరాబాద్, అక్టోబర్ 10: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేసే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి అసంతృప్తుల జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యమంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు సీట్లు దక్కకపోవడంతో.. ఆయా ఎమ్మెల్యేలు ఇంతకాలం అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ వారితో సంప్రదింపులు జరిపి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఈ క్రమంలో జనగామ BRS అభ్యర్థి విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. జనగామ టికెట్‌కు బదులుగా టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేపట్టడంతో సమస్య సెటిల్‌ అయినట్టే కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్లబ్‌ హౌస్‌లో పల్లా రాజేశ్వరరెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో మంత్రి కే తారక రామారావు సమావేశమయ్యారు. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించాలని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కేటీఆర్ కోరారు. ఈ క్రమంలో ఇద్దరితో మాట్లాడి వారితో చేతులు కలిపించి కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. దీంతో జనగామ టికెట్‌ విషయమై BRSలో నెలకొన్ని వివాదానికి తెరపడినట్టు అయింది. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో పాటు జనగామ టికెట్‌ ఆశించిన మరో ఇద్దరు నేతలు మండల శ్రీరాములు, కిరణ్‌ కుమార్‌ గౌడ్‌ కూడా పాల్గొన్నారు. అయితే, జనగామ టికెట్‌ విషయమై గత కొన్నాళ్లుగా BRSలో తీవ్ర పోరు జరుగుతోంది. పల్లా రాజేశ్వరరెడ్డి అభ్యర్థిత్వాన్ని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అర్థనగ్న ప్రదర్శనలూ చేపట్టారు. హైదరాబాద్‌లో పోటాపోటీ సమావేశాలు, ఆడియో లీకులతో జనగామ జగడం ముదిరిపోయింది. అధిష్టానం సంప్రదించినా చల్లారలేదు.. చివరకు కేటీఆర్ రంగంలోకి దిగి మాట్లాడటంతో ముత్తిరెడ్డి పల్లాకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జనగామ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై చుట్టూ అనేక వివాదాలున్నాయి. దానికి తోడు ఆయన కూతురు తుల్జా భవానిరెడ్డి తన తండ్రి కబ్జాకోరు అని బహిరంగంగా ఆరోపించారు. అయితే BRS నాయకత్వం ముత్తిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇవ్వడంతో జనగామ జగడానికి ఫుల్‌స్టాప్‌ పడ్డట్టు అయింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :