జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 16 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కామారెడ్డి నియోజక వర్గం నుంచి రేవంత్రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్ పోటీచేయనున్న సంగతి తెలిసిందే. ఇక బోథ్, వనపర్తి స్థానాలకు రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్థులను మార్పు చేసింది. వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో తూడి మేఘారెడ్డి, బోథ్లో వెన్నెల అశోక్ స్థానంలో గజేందర్కు టికెట్లు కేటాయించింది. అయితే మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ సీట్లు పెండింగ్లో ఉంచింది. కాంగ్రెస్ మూడో జాబితా ఇదే.. చెన్నూరు-జి.వివేక్ బోథ్ – గజేందర్ కామారెడ్డి – రేవంత్ జుక్కల్-తోట లక్ష్మీకాంతరావు బాన్సువాడ-ఏనుగు రవీందర్రెడ్డి నిజామాబాద్-షబ్బీర్అలీ కరీంనగర్-పురుమళ్ల శ్రీనివాస్ సిరిసిల్ల- మహేందర్రెడ్డి నారాయణఖేడ్-సురేష్ షెట్కార్ పటాన్చెరు-నీలం మధు వనపర్తి-మేఘారెడ్డి, డోర్నకల్-రామచంద్రునాయక్ ఇల్లందు-కోరం కనకయ్య, వైరా-రామ్దాస్ సత్తుపల్లి-మట్టా రాగమయి, అశ్వరావుపేట-ఆదినారాయణ
Admin