Saturday, 18 May 2024 01:42:05 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..

Date : 18 November 2023 12:44 PM Views : 83

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ దంగల్‌లో ప్రచారం హీటెక్కుతోంది. బీజేపీ సకల జనుల సంకల్ప సభ పేరిట ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతుంది. ఇవాళ అమిత్‌ షా గద్వాల, నల్లగొండ, వరంగల్‌ తూర్పు.. ఈ మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే సకల జనుల సంకల్ప సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అయితే కేంద్రహోమంత్రి శుక్రవారం రాత్రికే హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉండగా.. ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. మధ్యాహ్నం 1.35 గంటలకు గద్వాల చేరుకుని అక్కడ బీజేపీ ఎన్నికల బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 3.35 గంటలకు నల్లగొండ సభలో పాల్గొంటారు అమిత్‌షా. సాయంత్రం 4.20 గంటలకు వరంగల్‌ చేరుకుని అక్కడి బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ సభలు అన్నీ పూర్తయ్యాక సాయంత్రం 6 గంటలకు తిరిగి బేగంపేట చేరుకుంటారు. సాయంత్రం 6.10 గంటలకు హోటల్‌ కత్రియలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్‌ షా విడుదల చేస్తారు. సాయంత్రం 6.45 నుంచి 7.45 గంటల వరకు క్లాసిక్‌ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్‌ ముఖ్యనేతల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :