Saturday, 18 May 2024 10:51:51 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఈడీ ఆస్తుల జప్తుపై హైకోర్టుకు ఎంపీ నామా

Date : 03 December 2022 09:03 AM Views : 183

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్ : రాంచీ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వే పనుల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ఈడీ పెట్టిన కేసును కొట్టేయాలని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీ నామా నాగేశ్వరరావు దాఖలు చేసిన రిట్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. ఈడీ కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భూయాన్‌‌‌‌ శుక్రవారం ఈడీకి నోటీసులు జారీ చేశారు. మధుకాన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ కంపెనీకి 2009లోనే నామా రాజీనామా చేశారని, ఆ కంపెనీతోగాని.. రాంచీ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వే లిమిటెడ్‌‌‌‌తోగాని ఆయనకు ఎలాంటి సంబంధం లేదని నామా తరఫు సీనియర్‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌ నిరంజన్‌‌‌‌రెడ్డి కోర్టుకు తెలిపారు. 2020లో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో కూడా ఆయన పేరు లేదని వెల్లడించారు. అయినా నామా ఆస్తులను జప్తు చేసి ఎటాచ్‌‌‌‌ చేశారని కోర్టుకు విన్నవించారు. ఈడీ చేసిన జప్తులపై స్టే ఇవ్వాలని కోరారు. ఈడీ తరఫున అడిషినల్‌‌‌‌ సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ సూర్యకరణ్‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు నుంచి నామా ఆర్డర్‌‌‌‌ పొందినందునా ఏవిధమైన చార్జిషీట్లు కూడా దాఖలు కాలేదని తెలిపారు. కేవలం ఆస్తుల జప్తు మాత్రమే జరిగిందన్నారు. వాదనలు విన్న కోర్టు.. ఈడీ కౌంటర్‌‌‌‌ వేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :