Saturday, 18 May 2024 09:22:36 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ బాస్‌.. తొలి సభ అక్కడి నుంచే ఎందుకు.?

Date : 11 October 2023 11:30 AM Views : 72

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ దూకుడుపెంచాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ప్రచారాలతో హోరెత్తిస్తుంటే. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది. మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌లు సుడిగాలి పర్యటనలతో రాష్ట్రంలో ఎన్నికల హీట్‌ను పెంచేశారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్‌లో జరిగే మొదటి సభతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు..ఈ సభలోనే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు హుస్నాబాద్‌పై పడింది. కేసీఆర్‌ హుస్నాబాద్‌ సభ నుంచే ఎందుకు ప్రచారం మొదలుపెడుతున్నారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అయితే దీని వెనకాల ఉన్న కారణాన్ని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఈ నెల 15వ తేదీన కేసీఆర్‌ నిర్వహించబోయే సభ ఏర్పాట్లను మంత్రి హరీష్‌ రావు పరిశీలించారు. అనంతరం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో మంత్రి హరీష్ రావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్‌లోని కార్యకర్తల మీద నమ్మకంతోనే సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారన్నారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్‌ బీఆర్‌ఎస్ పార్టీకి కలిసి వచ్చిన నియోజకవర్గమని సీఎం తెలిపారన్నారు మంత్రి. తెలంగాణలో మూడోసారి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని మంత్రి అన్నారు. అసత్య సర్వేలతో కాంగ్రెస్‌ గ్లోబల్స్‌ ప్రచారం చేస్తుందన్న మంత్రి, కనీసం పార్టీలో ఉన్న నేతలకు టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనీ పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఉందన్నారు. హుస్నాబాద్‌లోని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బీజేపీ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రి. గౌరవెల్లి ప్రాజెక్ట్‌ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గొప్ప వరమని హరీష్‌ రావు అన్నారు. ఈ నెల 15వ తేదీన బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ప్రతిపక్షాల మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం ఖాయమని, 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క హామీ కుడా అమలు చేయలేదని, 2004లో తెలంగాణ ఇస్తామని బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌ను మింగేయాలని చూసిందని చెప్పుకొచ్చారు. మూడు గంటల కరెంట్ ఇస్తామని అంటున్న కాంగ్రెస్‌ కావాలా.? పొలాల దగ్గర మీటర్లు పెడుతామంటున్న బీజేపీ కావాలా.? 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కావాలా.? అని రైతులు ఆలోచించుకోవాలని హరీష్‌ రావు అన్నారు. కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారని, బీజేపీ వాళ్లు తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారన్నారు. ఒకప్పుడు తిండి లేని తెలంగాణ ఈ రోజు దక్షిణ భారత దేశ ధాన్య బండాగారంగా మారిందన్నారు. వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ అయిందన్నారు. కైలాసంలో పెద్ద పాము మింగినట్టు తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ల చేతిలో పడితే తెలంగాణ కింద పడుతుందని దీన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :