జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్: బీజేవైఎం కార్యకర్తల ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం బీజేవైఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్ వైపుకు దూసుకొచ్చారు. ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేవైఎం నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు గోషామహాల్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ మాట్లాడుతూ... ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోతున్నారన్నారు. దేహదారుఢ్య పరీక్ష ప్రమాణాలు పెంచి ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులను మనోవేదనకు గురి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే లాంగ్ జంప్ ను 4మీటర్ల నుంచి 3.8కు కుదించాలని, పాత పద్ధతిలోనే దేహాదారుడ్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ భానుప్రకాష్ డిమాండ్ చేశారు.
Admin