జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ విడుదల చేసింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది
Admin