జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : రంగారెడ్డి : హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో క్షుద్ర పూజలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. హైదర్ షాకోట్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. పాఠశాల సైన్స్ లాబ్, స్టోర్ రూమ్ ఎదుట రెండు ప్రాంతాల్లో బొమ్మలు, పసుపు, కుంకుమ, గువ్వలు, మేకులు, నిమ్మకాయలను గుర్తించారు. వీటిని చూసి ఒక్కసారిగా విద్యార్థులు, ఉపాద్యాయులు భయభ్రాంతులకు గురయ్యారు. పాఠశాలలోని సీసీ కెమెరాలను మాయం చేసి మరీ క్షుద్ర పూజలు నిర్వహించడం గమనార్హం
Admin