జై భీమ్ టీవీ - తెలంగాణ / రాజన్న సిరిసిల్ల జిల్లా : జై భీమ్ ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలక్షిషన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి.గత ఎన్నికల్లో ఇల్లంతకుంట మండలానికి ఇచ్చిన పలు హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించారు.ఈ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.అయితే ప్రభుత్వానికి,ఎమ్మెల్యే రసమయికి వ్యతిరకంగా వెలిసిన పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.ఫ్లెక్సీల్లో ఏముందంటే మోసం చేసిన దొర దగా పడిన జనం అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వాన్ని నిలదీశారు.ఇల్లంతకుంట మండలంలో ఎంతమంది దళితులకు దళిత బంధు ఇచ్చావు!ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమిని ఇచ్చావు,ఎంతమందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చావు,ప్రతి మండలంలోని సర్పంచ్ లు నిధులు లేక ఆత్వహత్యలు చేసుకుంటున్నారో చూడు,ఇల్లంతకుంట మండలంలోని డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తానన్నవి చేప్పతావా?8 సంవత్సవాలు గడిచాయి.గుర్తుందా? ఇల్లంతకుంట యువతకు క్రీడా ప్రాంగణం ఇస్తానన్నావు?అంటూ ప్రశ్నించారు.మరోఫ్లెక్సీలో...విప్పల,దాచారం,బోటుమీదపల్లి వరకు సీసీ రోడ్డు వేస్తానని భూమిపూజ చేశావు.ఇంతవరకు దాని జాడేలేదు.దాచారం గ్రామంలో ఇంతవరకు డబుల్ బెడ్ రూమ్స్ లేనే లేవు,కుల సంఘాలను కట్టిస్తానని హామీ ఇచ్చారు.ఇంతవరకు కట్టించలేదు.బస్ స్టేషన్ కట్టిస్తానని భూమిపూజ చేసి చివరకు దాన్ని కూడా మరిచారు.బస్ స్టేషన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సారు. ఇక చాలు బై.. బై..అంటూ ఫ్లెక్సీల్లో అగంతకులు కామెంట్లు చేశారు.
Admin