జై భీమ్ టీవీ - తెలంగాణ / : ఎన్నికల టైమ్ దగ్గరపడుతోంది. తెలంగాణవ్యాప్తంగా కొత్త కొత్త చేరికలు..సీనియర్ నేతల పార్టీల మార్పులతో సరికొత్త సమీకరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో బిజెపికి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత కాషాయం పార్టీని వదిలి హస్తం పార్టీలో చేరడం ఖాయమైపోయింది. మరి వెళ్లబోతూ..సంచలన కామెంట్స్ చేశారు ఆ పెద్దాయన. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కమలం పార్టీకి గుడ్బై చెప్పబోతున్నారు. కాంగ్రెస్లో ఆయన చేరికకు ముహూర్తం దాదాపు ఖరారైపోయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తుమ్మల, పొంగులేటి సహా పలువురు సీనియర్లు రేవూరి ప్రకాష్రెడ్డితో మంతనాలు జరపటంతో..కాషాయ కండువా పక్కన పెట్టబోతున్నారు రేవూరి. రెడ్డి సామాజికవర్గం అంతా ఒకేతాటి పైకి వచ్చి బీఆర్ఎస్ని ఓడించాలన్న టార్గెట్తో ఉంది కాంగ్రెస్. అందుకే రేవూరిని తమతో కలిసి రావాలని కాంగ్రెస్ నేతలు కోరినట్లు సమాచారం. ఆయన కూడా సానుకూలంగా స్పందించటంతో కాంగ్రెస్లో చేరిక దాదాపు ఖరారైపోయింది. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు రేవూరి. >>spot తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవూరి ప్రకాశ్రెడ్డి. ఒకప్పుడు కాంగ్రెస్లో గ్రూపుల గోల ఉండేదని, ఇప్పుడు బీజేపీలోనూ గ్రూప్ పాలిటిక్స్ పెరిగిపోయాయన్నారు. నేతల మధ్యే ఏకాభిప్రాయం లేదని విమర్శించారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్ ఒక్కటే ప్రత్నామ్నాయన్నారు. బండి సంజయ్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి బీజేపీ సెల్ఫ్గోల్లో పడిపోయిందన్నారు. రేవూరి పార్టీ వీడతారన్న వార్తతో నర్సంపేట బీజేపీలో గందరగోళం నెలకొంది. నర్సంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కొన్నాళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు రేవూరి. ఇప్పుడాయన కాంగ్రెస్లో చేరాలన్న నిర్ణయానికి రావటంతో.. నర్సంపేటలో బీజేపీ అభ్యర్థి ఎవరన్న ప్రశ్న మొదలైంది. మరోవైపు నర్సంపేటలో ఇప్పటికే కాంగ్రెస్ దొంతి మాధవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎక్కడినుంచి బరిలోకి దింపుతారనే చర్చ మొదలైంది. రేవూరిని పరకాల నుంచి పోటీకి దించే వ్యూహంతో కాంగ్రెస్ ఉందంటున్నారు. అధినాయకత్వం ముందు కూడా అదే ప్రతిపాదన పెట్టిందట తెలంగాణ కాంగ్రెస్. రేవూరి ప్రకాష్రెడ్డి కూడా పరకాల నుంచి పోటీకి సుముఖంగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవే ఉందన్న అభిప్రాయంతో ఉన్న రేవూరి.. పరకాల నుంచైనా గెలవగలనన్న ధీమాతో ఉన్నారట. అందుకే కాంగ్రెస్ నాయకత్వం ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించారని, పరకాలపై దృష్టి పెట్టబోతున్నారని చెబుతున్నారు. రేవూరి బుధవారం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. మరి రేవూరి పరకాల నుంచి పోటీచేస్తే ఇప్పటికే పరకాలపై ఆశలు పెట్టుకున్న కొండా మురళి, ఇనుగాల వెంకట్రామిరెడ్డి పరిస్థితేంటన్న చర్చ జరుగుతోంది.
Admin