Saturday, 18 May 2024 01:00:09 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బీసీ నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ.. ఎన్నికల మ్యానిఫెస్టో ఇలా ఉండే అవకాశం..

Date : 14 November 2023 12:28 PM Views : 70

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియతో పాటూ పరిశీలన కూడా పూర్తి చేశారు అధికారులు. ఇక ప్రచారంలో జోరందుకున్నాయి రాజకీయ పార్టీలు. ఈ క్రమంలో బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్దమైంది. దీని కోసం కార్యాచరణం రచిస్తోంది. మ్యానిఫెస్టో కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రకటించిన వాటికంటే కూడా భిన్నంగా మ్యానిఫెస్టోని విడుదల చేయాలని భావిస్తున్నారు కాషాయ పెద్దలు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువకులులతో పాటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలను కలుపుకొని పోయేలా సరికొత్త మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా ఫుల్ మీల్స్ లాంటి మ్యానిఫెస్టోను రూపొందించి కేంద్ర మంత్రి అమిత్ షాకి అందించనున్నారు. దీనిని ఆయన పరిశీలించిన తరువాత ముసాయిదాను కూడా మరోసారి పరిశీలించనున్నారు. పార్టీ నుంచి బరిలో దిగే అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చాక మ్యానిఫెస్టోని విడుదల చేయడం కమలం పార్టీకి ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 17న అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌ భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నట్లు సమాచారం. అప్పుడే ఈ మ్యానిఫెస్టోని విడుదల చేయాలని భావిస్తోంది బీజేపీ. దీంతో పాటూ బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసేందుకు చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ చేయలేని పనిని బీజేపీ చేస్తోంది. ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇస్తోంది. దీనికోసం బీసీలందరూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటోంది. అలాగే సెంటిమెంట్‌ను రగిలించాలని భావిస్తున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మ్యానిఫెస్టో ఇలా ఉండే అవకాశం తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ. 10 లక్షల దాకా ఉచిత వైద్యం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అర్హులైన ప్రతి పేద వ్యక్తికి ఇల్లు రైతులను ఆదుకునేందుకు వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,100 వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ. 20వేలు చెల్లింపు నిరుద్యోగులకు యూపీఎస్సీ మాదిరిగానే టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు జాబ్‌ కేలెండర్‌ ప్రతి వ్యక్తికి జీవిత బీమా వర్తింపు రైతులకే కాకుండా కౌలు రైతులు, అటో రిక్షాకార్మికులు, ఇతర పేదలకు ప్రమాదబీమా రూ. 5 లక్షలు చెల్లింపు వివాహిత మహిళలకు ఏడాదికి రూ.12 వేల భృతి మహిళా సంఘాలు, రైతులకు వడ్డీలేని రుణాలు వంట గ్యాస్‌ సిలిండర్‌ రూ.500 కే అందించేలా చర్యలు ఇంట్లో వృద్ధులైన భార్యా, భర్తలు ఇద్దరికీ రెండు పెన్షన్లు ఐఐటీ, ఎయిమ్స్‌ తరహాలో ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల ఏర్పాటు జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :