Saturday, 18 May 2024 10:36:25 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అటు అగ్రనేతలు.. ఇటు పవన్ కల్యాణ్.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్..

Date : 21 November 2023 09:16 AM Views : 64

జై భీమ్ టీవీ - తెలంగాణ / : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం పూర్తిగా ఫోకస్‌ చేసింది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కమలనాథులు కదం తొక్కుతున్నారు. తెలంగాణలో మంగళవారం నిర్మలాసీతారామన్‌, ఫడ్నవీస్, పీయుష్‌ గోయల్‌ ప్రచారం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లో నిర్మలా సీతారామన్, ముషీరాబాద్‌లో దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రచారం చేస్తారు. 24, 25, 26 తేదీల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పర్యటించనున్నారు. ఈ నెల 25, 26న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పర్యటిస్తారు. హుజూరాబాద్‌, మహేశ్వరం సభలకు ఆమె హాజరవుతారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఈ నెల 22న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 26న అమిత్‌షాతో కలిసి పవన్‌ హైదరాబాద్‌లో ప్రచారం చేస్తారు. పొత్తులో భాగంగా ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్.. ప్రచారం పార్టీకి కలిసివస్తుందని కాషాయపార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. ప్రచారంలో భాగంగా.. పవన్ కల్యాణ్ వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో రోడ్ షో చేయనున్నారు. నెలాఖరులో తెలంగాణలో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు వరకూ తెలంగాణలోనే మకాం వేయడం ద్వారా బీజేపీ కేడర్‌లో జోష్‌ నింపనున్నారు మోదీ.. ఇప్పటికే పలు సభలు, కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. తెలంగాణలో బీజేపీని గెలిపించాలంటూ కోరారు. అగ్రనేతల షెడ్యూల్ ఇలా.. 24, 25, 26 తేదీల్లో యూపీ సీఎం యోగి పర్యటన ఈ నెల 25, 26న స్మృతి ఇరానీ పర్యటన ఈ నెల 22న వరంగల్‌ బహిరంగ సభకు పవన్‌ ఈ నెల 26న అమిత్‌షాతో కలిసి పవన్‌ ప్రచారం ఈనెల 25, 26, 27 తేదీల్లో మోదీ ప్రచారం

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :