Monday, 12 May 2025 07:55:42 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

టీఎస్‌ సెట్‌ 2023 హాల్‌టికెట్లు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

Date : 20 October 2023 08:14 PM Views : 263

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్‌ సెట్‌-2023) హాల్‌టికెట్లను శుక్రవారం (అక్టోబర్ 20) ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. సెట్‌ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. టీఎస్‌ సెట్‌-2023 పరీక్ష అక్టోబర్‌ 28, 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్న సంగతి తెలిసిందే. టీఎస్‌ సెట్‌ పరీక్ష రెండు పేపర్లను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ రెండు పేపర్లలోని ప్రశ్నలను ఆబ్జెక్టివ్‌ విధానంలో మాత్రమే ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది. పేపర్‌ 1 పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అలాగే పేపర్‌ 2 పరీక్షలో వంద ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయిస్తారు. పేపర్ 2 పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి కోత విధిస్తారు. కంప్యూటర్‌ ఆధారిత టెస్టు (సీబీటీ) పద్ధతిలో జరిగే ఈ పరీక్షకు ప్రతీయేట లక్షల్లో అభ్యర్ధులు పరీక్షలు రాస్తుంటారు. కాగా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లుగా అర్హత సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీయేట టీఎస్‌ సెట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. జనరల్‌ స్టడీస్‌, 29 సబ్జెక్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రతీయేట నిర్వహిస్తుంటారు. హైదరాబాద్, వరంగల్, కర్నూలు, ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం,రంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి హాల్‌ టికెట్లతోపాటు సంబంధిత గుర్తింపు పత్రాలు కూడా తీసుకురావాలని ఉస్మానియా యూనివర్సిటీ సూచించింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :