జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : బీఆర్ఎస్ MLA రేఖానాయక్కు తెలంగాణ సర్కారు ఝలక్ ఇచ్చింది. ఆమెకు రాబోయే ఎన్నికల్లో MLA టికెట్ను పార్టీ అధిష్టానం నిరాకరించింది. దీంతో ఆమె కాంగ్రెస్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చానని, ఆ పార్టీలోకి తిరిగి వెళ్తానని సోమవారం ఆమె వ్యాఖ్యానించారు. ఇది జరిగిన గంటలోపే ఆమె అల్లుడు, మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర పవార్ను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Admin