జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : మేడ్చల్ జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. మంత్రి మల్లారెడ్డి స్థానిక పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ మంత్రి ముందే మల్లారెడ్డి డౌన్. డౌన్ అంటూ సమావేశ మందిరంలో జడ్పిటిసి హరివర్ధన్ రెడ్డి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి లు బైఠాయించారు. మేడ్చల్ నియోజకవర్గంలో కడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను స్థానికులకు 10 శాతం ఇచ్చి మిగతావి బయటి వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అనడంతో ఒక్కసారిగా మూడుచింతలపల్లి హరివర్ధన్ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిలు లేచి మంత్రి వాఖ్యలను ఖండించారు. స్థానికంగా ఉన్న ప్రజలకు 50శాతం డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని మిగతావి బయటివాళ్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రికి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ హరి వర్ధన్ రెడ్డికి మధ్య తీవ్రంగా వివాదం నెలకొంది. మంత్రి సమాధానం చెప్పకుండా పారిపోతున్నాడు అంటూ హరివర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు
Admin