Saturday, 18 May 2024 01:11:16 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌-2023 పేపర్‌-1 ఫలితాలు విడుదల

Date : 18 November 2023 08:02 AM Views : 70

జై భీమ్ టీవీ - తెలంగాణ / : న్యూఢిల్లీ, నవంబర్‌ 17: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి నిర్వహించిన పేపర్‌-1 రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్‌-1 పరీక్షలో మొత్తం 12,227 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కమిషన్‌ పేర్కొంది. పేపర్‌ 1 పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారందరూ పేపర్‌-2 పరీక్షకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌-2023 నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో గ్రూప్‌-బి నాన్‌ గెజిటెడ్‌ జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో ఉద్యోగాలు పొందుకుంటారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సెవెన్త్‌ పే స్కేలు కింద నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. పేపర్‌-1, పేపర్‌-2 ఆన్‌లైన్‌ రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఉపకారవేతనాలకు దరఖాస్తులు.. ఎవరెవరు అర్హులంటే ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకారవేతనం అందించడానికి ప్రతిభ గల విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2024)కు ప్రతీ యేట మాదిరి గానే ఈ ఏడాది కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జీఈఎస్‌టీ-2024 డిసెంబర్‌ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 18 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జీఈఎస్‌టీ-2024 పరీక్షలో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున అందిస్తారు. ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ పూర్తి చేసేవరకు ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఆసక్తి కలిగిన వారు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఐటీఐలో స్వల్పకాలిక కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 4.0 షార్ట్‌ టర్మ్‌ కింద 3 నెలలు కోర్సులను ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ ఎం కనకారావు తెలిపారు. పదో తరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్‌ డొమెస్టిక్‌ సొల్యూషన్స్, ప్లంబర్‌ జనరల్‌ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపిక చేసిన విద్యార్థులకు బస్‌పాస్‌ సౌకర్యం కల్పిస్తామన్నానరు. కోర్సు శిక్షణ కాలం పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్లు అందిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు నవంబరు 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 0866-2475575, 77804-29468, 91825-34259 సంప్రదించాలని సూచించారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :