జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని ఎత్తుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలం తామేనని.. పార్టీని బతికించుకునే బాధ్యత కూడా తమదేనని క్లియర్ కట్గా తేల్చేశారు. తమ పంచాయితీ అంతా టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలతోనే అని కుండబద్దలు కొట్టారు. కొత్త కమిటీల ఏర్పాటుతో మొదలైన కల్లోలం.. రేవంత్రెడ్డితో తాడో పేడో అనే దాకా వెళ్లింది. దీంతో ఈ అసంతృప్తి, అలకల తుపాను ఏ తీరం దాకా వెళ్తుందోనన్న ఆందోళన టీకాంగ్రెస్లో మొదలైంది. భట్టి నివాసంలో జరిగిన భేటీకి ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సింహా, మధుయాష్కి, జగ్గారెడ్డితో పలువురు సీనియర్లంతా హాజరయ్యారు. వాళ్లందరూ మూకుమ్మడిగా తీసుకున్న నిర్ణయం.. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడం. ఎట్ ద సేమ్ టైమ్ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కమిటీల్లో ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. కమిటీల్లో 108మందికి స్థానం కల్పిస్తే అందులో 54 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయితీ అంతా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకి.. వలస వచ్చిన వాళ్లకు మధ్యేనని స్పష్టం చేశారు సీనియర్ నేతలు. అసలు సిసలు సీనియర్లను విస్మరించి.. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోవర్టులన్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఖండించకపోవడాన్ని తప్పుబట్టారు జగ్గారెడ్డి.
Admin