జై భీమ్ టీవీ - తెలంగాణ / : మెదక్, అక్టోబర్ 30: బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎన్నికల ప్రచారంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు. ప్రభాకర్రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని బీఆర్ఎస్ కార్యకర్తలు చితక్కొట్టారు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుబ్బాక నుంచి పోటీ చేస్తున్నారు కొత్త ప్రభాకర్రెడ్డి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. ఇందులో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డి దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో ఆయన కారు నుంచి కిందికి దిగిన తర్వాత కత్తితో దాడి చేశాడు నిందితుడు. వెంటనే ప్రభాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిందన్న సమాచారం తెలిసిన వెంటనే మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఫోన్లో మాట్లాడారు. అవసరం అయితే హైదరాబాద్ కు తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలకు హరీష్ రావు సూచించారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారిని మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద కు తరలిస్తున్నారు.
Admin