Saturday, 18 May 2024 01:41:56 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు గుడ్‌బై.. బుధవారం కాంగ్రెస్‌లోకి..

Date : 17 October 2023 06:19 PM Views : 73

జై భీమ్ టీవీ - తెలంగాణ / : బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు BRSకి గుడ్‌బై చెప్పనున్నారు. రేపు కాంగ్రెస్‌లో చేరనున్నారు రాథోడ్ బాపురావు. బోథ్‌ BRS టిక్కెట్‌ రాథోడ్ బాపురావుకు దక్కకపోవడంతో పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. బోథ్ సీటు ఇస్తామని కాంగ్రెస్‌ నుంచి ఆఫర్‌ రావడంతో రేవంత్‌ రెడ్డిని కలిశారు రాథోడ్‌ బాపురావు. బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రాథోడ్ బాపురావు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. రాథోడ్ బాపురావుకు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించింది. అక్టోబరు 18న కాంగ్రెస్ లో చేరిన బాపురావు హస్తం పార్టీ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బోథ్ ఎమ్మెల్యే బాపురావు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ నాయకత్వం పక్కనబెట్టి అనిల్ జాదవ్‌కు సీటు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, రేఖా నాయక్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఏడు స్థానాల్లో మార్పులు చేశారు. ఈసారి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సుభాష్‌రెడ్డి (ఉప్పల్‌), రాజయ్య (స్టేషన్‌ ఘన్‌పూర్‌), రాములు నాయక్‌ (వైరా), రేఖానాయక్‌ (ఖానాపూర్‌), చెన్నమనేని రమేష్‌ (వేములవాడ), గంప గోవర్ధన్‌ (కామారెడ్డి), రాథోడ్‌ బాపురావు (బోత్‌), విద్యాసాగర్‌రావు టిక్కెట్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ తొలి జాబితాలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌ వంటి మాజీ బీఆర్‌ఎస్‌ నేతలకు టిక్కెట్లు ఇచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. దసరా తర్వాత పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణలో పర్యటించి అక్టోబర్ 18న బస్సుయాత్ర చేపట్టనున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :