జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత రేపిన వైఎస్. షర్మిల అరెస్టు ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. రేపటి (గురువారం) నుంచి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. అపిన చోట నుంచే పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. ఇవాళ ముఖ్య నాయకులతో భేటీ అయిన తర్వాత మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నిన్నటి పరిణామాల పై మీడియా తో మరోసారి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. నర్సంపేటలో తమ వాహనాలపై దాడి చేసిన ఘటనకు నిరసనగా వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ధ్వంసమైన కారులోనే నిరసన తెలిపేందుకు బయల్దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె కారును అడ్డుకున్నారు. వాహనం దిగాలని కోరారు. అయినా ఆమె దిగకపోవడంతో కారుతో సహా క్రేన్ సహాయంతో బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో అభిమానులు, కార్యకర్తలుల ఆందోళన చేశారు. ఈ పరిస్థితుల నడుమ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం తీవ్ర నాటకీయ పరిస్థితుల మధ్య వైఎస్.షర్మిలకు బెయిల్ మంజూరు అయింది. అంతే కాకుండా ఆమె పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Admin