Saturday, 18 May 2024 10:51:52 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రాజన్న సిరిసిల్లలో యువతి కిడ్నాప్ పై మంత్రి కేటీఆర్ సీరియస్

రాజన్న సిరిసిల్లలో యువతి కిడ్నాప్ పై మంత్రి కేటీఆర్ సీరియస్

Date : 20 December 2022 02:52 PM Views : 203

జై భీమ్ టీవీ - తెలంగాణ / కరీంనగర్ జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వేములవాడ పర్యటనలో ఉన్న కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే‭ను పిలిపించుకుని యువతి కిడ్నాప్ పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతలపై ఆయన ఆరా తీశారు. యువతిని కిడ్నాప్ చేసిన నిందితులను సాయంత్రంలోపు పట్టుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఉపేక్షించొద్దని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మూడపల్లిలో ఇవాళ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యువతి కిడ్నాపైన విషయం తెలిసిందే. తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా యువతిని కిడ్నాప్ చేశారు. యువతి వచ్చే దారిలో అప్పటికే కారులో కాపు కాసి ఉన్న నలుగురు యువకులు... ఆమె తండ్రిని కొట్టి బలవంతంగా కారులో లాక్కెళ్లారు. ఈ కిడ్నాప్ ఘటనపై అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్ర చారి విచారణను కొనసాగిస్తున్నారు.

JAI BHEEM TV

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :