Saturday, 18 May 2024 09:42:14 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ సంస్థ : మంత్రి కేటీఆర్

Date : 13 December 2022 01:29 PM Views : 186

జై భీమ్ టీవీ - తెలంగాణ / : రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు కార్ల డిజైనింగ్, తయారీపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా తెలంగాణ ఉత్పత్తులను అందించాలని కోరారు. జపాన్ కు చెందిన ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సొల్యూషన్ డైఫుకు సంస్థ తెలంగాణలో అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఆ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఉపాధి అవకాశాలు.. తెలంగాణలో డైఫుకు సంస్థ రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటుతో యువతకు 800కుపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. హైదరాబాద్​ లో మరో 8 నెలల్లో ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని చెప్పారు. అత్యాధునిక ఫ్యాక్టరీ ద్వారా ఆటోమేటెడ్ స్టోరేజ్, రిట్రీవర్ సిస్టమ్స్, సార్టింగ్ ట్రాన్స్ఫర్, వెహికిల్స్ కన్వేయర్ల వంటి వరల్డ్ క్లాస్ పరికరాలు తయారవుతాయని తెలిపారు. కార్ల తయారీ చూసి ఆశ్చర్యపోయా.. జపాన్ లో సుజుకీ తయారీ మ్యూజియాన్ని సందర్శించానని..అక్కడ విద్యార్థుల కార్ల తయారీకి మంత్రముగ్ధుడిని అయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. జపాన్ తయారీ రంగంలో ప్రపంచానికే ఆదర్శమని, అందుకే జపాన్ వస్తువులను దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ తయారీ రంగంలో గ్లోబల్ ప్లేయర్స్ ను పెంచాలని సూచించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :