Saturday, 04 May 2024 09:20:59 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు..

ఒక్క రోజే ఎన్ని నమోదయ్యాయంటే

Date : 22 December 2023 11:27 PM Views : 119

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఒమెక్రాన్ కొత్త వేరియంట్ జెఎస్.1 కలకలం రేపుతోంది. చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. నిన్నటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 20గా ఉండగా.. ఈరోజు కొత్తగా మరో తొమ్మిది కొత్త కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య 27కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1245 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అయితే.. హైదరాబాద్‌లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు అధికారులు. రంగారెడ్డిలో ఒకరికి కోవిడ్ సోకింది. నిలోఫర్ ఆస్పత్రిలో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. క‌రోనా కేసులు అల‌జ‌డి సృష్టిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప‌దేండ్ల లోపు చిన్నారులు, 60 ఏండ్లు పైబ‌డ్డ వారు జాగ్రత్తగా ఉండాల‌ని, అన‌వ‌స‌రంగా త‌మ నివాసాల నుంచి బ‌య‌ట‌కు రాకూడద‌ని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇక ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా ధ‌రించాల‌ని ఆదేశించింది. జ్వరం, ద‌గ్గు, జ‌లుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు త‌లెత్తితే తక్షణమే కోవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని సూచించింది. అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్దంగా ఉంచినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ‌లో రిక‌వ‌రీ రేటు 99.51 శాతంగా ఉందని అధికారికంగా తెలిపారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :