Saturday, 18 May 2024 01:00:02 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క.. రంగంలోకి దిగిన ఆ ముగ్గురు.. హైస్పీడులో దూసుకెళ్తున్న బీఆర్‌ఎస్‌..

Date : 11 October 2023 11:33 AM Views : 122

జై భీమ్ టీవీ - తెలంగాణ / : తెలంగాణలో రాజకీయం కాకరేపుతోంది. ఇప్పటివరకూ ఒక లెక్క, ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్టు మారిపోయింది పొలిటికల్‌ సీన్‌. ఎన్నికల షెడ్యూల్‌ అలా విడుదలయ్యిందో లేదో ఒక్కసారిగా స్పీడ్‌ పెంచేశాయ్‌ పార్టీలు. గెలుపే లక్ష్యంగా దూకుడు రెట్టింపు చేశాయ్‌. కాంగ్రెస్‌, బీజేపీతో పోలిస్తే అధికార పార్టీ బీఆర్‌ఎస్సే జోరు మీదుంది. ఎలక్షన్‌ షెడ్యూల్‌ రాకముందు నుంచే కేటీఆర్‌ జిల్లాలను చుట్టేస్తుంటే, త్వరలో గులాబీ బాస్‌ రంగంలోకి దిగబోతున్నారు. ఈనెల 15న హుస్నాబాద్‌ సభతో సమరశంఖం పూరించనున్నారు కేసీఆర్‌. ఆ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రి హరీష్‌రావు కీలక కామెంట్స్‌ చేశారు. హుస్నాబాద్‌ సభ తర్వాత విపక్షాల మైండ్‌బ్లాక్‌ కావడం ఖాయమన్నారు. కేసీఆర్‌ రంగంలోకి దిగనంతవరకే విపక్షాల కుప్పిగంతులు, ఒక్కసారి గులాబీ బాస్‌ రంగంలోకి దిగారంటే వాళ్ల ఆట ముగిసినట్టే అంటూ సినిమా స్టైల్లో పంచ్‌ డైలాగ్స్‌ పేల్చారు హరీష్‌రావ్‌. కేసీఆర్‌ సభ ఏర్పాట్లలో హరీష్‌రావు బిజీగా ఉంటే, నేతల మధ్య సయోధ్య కుదిర్చే పనిలో ఉన్నారు కేటీఆర్‌. జనగామలో ఉప్పూనిప్పులా ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య రాజీ కుదిర్చారు. ఇద్దరితో సమావేశమై నచ్చజెప్పారు. జనగామలో పల్లాను గెలిపించుకోవాలంటూ సూచించారు. దాంతో, ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా వార్‌కు తెరపడినట్టయ్యింది. బీసీల ప్రభుత్వం.. కవిత.. మరోవైపు, ఆత్మీయ సమ్మేళనాలతో మమేకమవుతున్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్‌లో నాయీ బ్రాహ్మణులతో సమావేశమై బీసీల కోసం కేసీఆర్‌ ఏమేం చేశారో గుర్తుచేశారు. ఇది బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కాదు… బీసీల ప్రభుత్వమన్నారు కవిత. బీసీల అభ్యున్నతి కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమే అన్నారు. రాష్ట్రం మొత్తంమీద 11లక్షల మందికి కల్యాణలక్ష్మి ఇస్తే, అందులో 7లక్షలమంది బీసీ ఆడబిడ్డలే ఉన్నారన్నారు కవిత. కేటీఆర్‌, కవిత, హరీష్‌రావు పొలిటికల్‌ యాక్టివిటీలో బిజీబిజీగా ఉంటే, కేసీఆర్‌ సతీమణి శోభ… కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే, తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వెంటనే తిరుమల వెళ్లడం, శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకోవడం ఆసక్తిగా మారింది. సభలు, సమావేశాలు, సయోధ్యలు, టూర్లతో జోరు పెంచిన బీఆర్‌ఎస్‌… మున్ముందు ఇంకెంత దూకుడు చూపిస్తుందో చూడాలి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :