Saturday, 27 July 2024 12:29:53 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి

Date : 25 November 2023 08:29 AM Views : 160

జై భీమ్ టీవీ - జాతియం / : రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో ఓ విషాదకరమైన ఘటన వెలుగు చూసింది. దాగుడుమూతలు ఆడుతున్న ఇద్దరు అక్కా చెల్లెల్లు ఇంట్లో నిరుపయోగంగా పడి ఉన్న డీప్‌ఫ్రీజర్‌లో దాక్కున్నారు. ఈ సమయంలో ఫ్రీజర్ బయటి నుంచి లాక్ అయింది. దీంతో ఆ ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. కొద్ది సేపటి క్రితం వరకు తమ కళ్ళ ముందు చకచకా పరుగు పెడుతూ ఆడుకున్న అక్కాచెల్లెళ్లు ఇక ఈ లోకంలో లేరని తెలిసిన వెంటనే ఇరు కుటుంబంలో విషాదం నెలకొంది. చిన్నారులను మృత్యువు పొట్టన పెట్టుకుందని తెలిసినా ఆ ప్రాంత వాసులు ఎవరూ నమ్మడం లేదు. ఈ ఘటనను ధృవీకరిస్తూ గురువారం మధ్యాహ్నం ఖమ్నోర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భవానీ శంకర్ తెలిపారు. ఇద్దరు కజిన్ సిస్టర్స్ ఇంట్లో దాగుడు మూతలు ఆడుతున్నారు. ఈ సమయంలో ఇంట్లో ఉపయోగించకుండా ఓ మూలన ఉన్న ఫ్రిజ్ లో దాక్కున్నారు. ఊపిరి ఆడక మరణించారు. మీడియా కథనాల ప్రకారం రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో పాయల్, రితిక అనే ఇద్దరు కజిన్ సిస్టర్స్ మధ్యాహ్నం తమ ఇంట్లో దాగుడుమూతలు ఆడుతున్నారు. ఆడుకుంటుండగా ఇద్దరూ వెళ్లి ఇంట్లోని పాడైన డీప్ ఫ్రీజర్ లో దాక్కున్నారు. అప్పుడు ఫ్రిజ్ ఆటోమేటిక్ గా లాక్ పడింది. తర్వాత తలుపు తెరచుకోక పోవడంతో ఇద్దరు అక్కచెల్లెలు చాలా సేపు ఫ్రిజ్‌లోనే ఉండిపోయారు. బాలికల కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో, ఆరుబయట అన్ని చోటల్లా వెదకడం ప్రారంభించిన కుటుంబ సభ్యులు తలుపు మూసి ఉన్న ఫ్రిడ్జ్ ను తెరచి చూడాగా చిన్నారులు కనిపించారు. అది చూసి షాక్ తో కేకలు వేశారు. అప్పటికే డీప్ ఫ్రీజర్‌లోని ఇద్దరి మృతదేహాలు గడ్డకట్టిపోయాయి. బాలికలిద్దరూ ఫ్రీజర్‌లో శవాలై పడి ఉన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాలికల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. అమ్మాయిల ప్రాణాలు తీసిన హైడ్ అండ్ సీక్ గేమ్ పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం.. కజిన్‌ సోదరులిద్దరి తండ్రులు ముంబైలో పనిచేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వారు ఇంటికి తిరిగి వస్తున్నారు. వారు తిరిగి వచ్చిన తర్వాత, బాలికల అంత్యక్రియలు కలిసి నిర్వహిస్తారు. కాగా, ఈ ఘటన కుటుంబసభ్యులతో పాటు ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారులు తమ మధ్య లేరంటే నమ్మలేకపోతున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. అమ్మాయిల పేర్లు పాయల్, రితిక. పాయల్ వయసు 10 ఏళ్లుగా, రితికా వయసు 11 ఏళ్లు. ఆడపిల్లలిద్దరూ ఎప్పుడూ కలిసి ఆడుకునేవారని ఈ రోజు కూడా దాగుడు మూతలు కలిసే ఆడుకున్నారని.. ఈ సమయంలో ఫ్రీజర్‌లో దాక్కున్నారని, అదే వారి మరణానికి కారణమని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :