Sunday, 08 September 2024 06:51:33 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ముంబైలో ‘ఉగ్ర’ అలజడి..

ముఖేష్ అంబానీ, అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు

Date : 01 March 2023 02:34 PM Views : 184

జై భీమ్ టీవీ - జాతియం / : ముంబైలో ఓ పాక్ ఉగ్రవాది ఎంటర్ అయ్యాడని ఎన్ఐఏ పోలీసు వర్గాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదిని పట్టుకునేందుకు జాతీయ సంస్థలు, పోలీసులు తీవ్రగాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ అగ్రనటులు అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడంతోపాటు ముంబైలో ఒక్కసారిగా కలకలం రేపింది. అగ్ర నటుల నివాసం వద్ద బాంబులు పెట్టామంటూ మంగళవారం ఉదయం నాగ్‌పుర్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. క్షణ్ణంగా పరిశీలించిన అనంతరం పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదని ముంబై పోలీసులు వెల్లడించారు. సమాచారం ప్రకారం.. అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్రతోపాటు యాంటిలియాలోని ముఖేష్ అంబానీ ఇంటికి కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు కాల్స్‌ చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. అయితే, అమితాబ్ బచ్చన్‌కు ముంబైలో ఐదు విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. అతని ఇళ్ల పేర్లు – జల్సా, జనక్, వత్స, ప్రతీక్ష. బచ్చన్‌లు ముంబైలో కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ప్రతీఖా. అమితాబ్ దివంగత తల్లిదండ్రులు నివసించే ఇల్లు ఇదే. ప్రస్తుతం బచ్చన్ కుటుంబం మొత్తం జల్సాలో నివసిస్తోంది. మరోవైపు ధర్మేంద్ర జుహూలోని బంగ్లాలో నివాసం ఉంటున్నారు. ఇదిలాఉంటే.. అంతకుముందు వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటికి పలు మార్లు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అంబానీ కుటుంబం Z+ సెక్యూరిటీని అందుకుంది. అంబానీ, అతని కుటుంబానికి Z+ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరడంతోపాటు.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. ముంబైలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా వారి భద్రతను పర్యవేక్షించాలని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నీ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భరిస్తారని కోర్టు తెలిపింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :