Sunday, 08 September 2024 06:43:26 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీలో కాస్త మెరుగైన వాయు నాణ్యత.. వీటిపై ఆంక్షలు సడలింపు

Date : 19 November 2023 09:02 AM Views : 115

జై భీమ్ టీవీ - జాతియం / : ఢిల్లీ అంటే ఒకప్పుడు దేశ రాజధానిగా గొప్పగా చెప్పుకునే వారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు అక్కడి స్థానికులు. ప్రస్తుతం పర్యాటకులు సంఖ్య భారీగా తగ్గింది. పిల్లల స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. పొగ వెలువడే వాహనాలకు అనుమతులు రద్దు చేశారు. వీటన్నింటికీ కారణం విపరీతంగా పెరిగిపోయిన వాయుకాలుష్యం. గతంలో వాయు నాణ్యత సూచి 600కు పైగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. అందుకే ఢిల్లీ నగరంలో కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల్లో గతంలో విధించిన ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఢిల్లీలో గాలిలో వేగం పెరిగింది. దీంతో పాటూ పవనదిశను మార్చుకుంది. దీని కారణంగా కాలుష్య తీవ్రత తగ్గినట్లు వివరించారు కాలుష్య కంట్రోల్ ప్లాన్ అధికారులు. ఢిల్లీలో వాయు నాణ్యత గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత మేర మెరుగవడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులకు తావిచ్చింది. సెప్టెంబరు చివరి వారం నుంచి నవంబర్ రెండవ వారం వరకూ క్లిష్టమైన పరిస్థితులు కొనసాగాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి సివియర్ నుంచి వెరీ పూర్ కు చేరుకుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఢిల్లీ నగరానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలను సడలించారు. స్కూళ్లకు దాదాపు వారం సెలవులు ప్రకటించిన ప్రభుత్వం సోమవారం నుంచి పాఠశాలలకు వెళ్లవచ్చని తెలిపారు. గతంలో నిర్మాణ రంగం నుంచి దుమ్ము, పొగ వెలువడటంతో నిర్మాణ పనులు రద్దు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం వీటిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. యదావిధిగా నిర్మాణ పనులు చేసుకోవచ్చని తెలిపింది. అలాగా కాలుష్యాన్ని వెదజల్లే ట్రక్కులకు అనుమతులు నిరాకరించిన ప్రభుత్వం.. ప్రస్తుతం వాటికి అనుమతి ఇస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. శుక్రవారం ఏక్యూఐ సూచి 405 కాగా శనివారం 319కి తగ్గినట్లు వెల్లడించారు. 24గంటల వ్యవధిలో భారీగా తగ్గినట్లు చెబుతున్నారు జీఆర్‌ఏపీ అధికారులు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :