జై భీమ్ టీవీ - జాతియం / : విశ్లేషణ : మోడాల చంద్రశేఖర్ సీనియర్ పాత్రికేయులు, ధ్యాన, సైన్స్ వ్యక్తిత్వ వికాస నిపుణులు 9440210283 ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టట్యూట్ 32,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాల సేకరించారు. దాని ఆధారంగా నివేదిక రూపొందించారు. భారత్లో దాదాపు సగం (47 శాతం) మంది ఉద్యోగుల్లో తమ కొలువు పట్ల అభద్రత నెలకొంది. భారత్లో 55 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే జనరేషన్ జెడ్లో రెట్టింపు మందిలో అభద్రత నెలకొంది. ఆర్థిక ఒడుదుడుకులు, అనిశ్చిత సమయంలో, ముఖ్యంగా బహుళ జాతి కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయన్న కథనాలతోపాటు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. జనరేషన్ జడ్ (18-24 వయసు గల వారు)లో సగం మంది ఉద్యోగ అభద్రతతో బాధపడుతున్నారు. అంతర్జాతీయంగా మీడియా, ఇన్ఫర్మేషన్ రంగాల్లో ఈ పరిస్థితి అధికంగా నెలకొంది. ఆ తరువాత స్థానాల్లో ఆతిథ్యం, వినోద రంగాలున్నాయి. భారత్లో రియల్ ఎస్టేట్, నిర్మాణం, సంబంధిత రంగాల కార్మికుల్లో ఉద్యోగ అభద్రత అధిక స్థాయిలో ఉంది. అన్ని మార్కెట్లలోనూ యువతలోనే ఉద్యోగ అభద్రత అధికం. 55 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే జనరేషన్ జెడ్లో రెట్టింపు మందిలో అభద్రత నెలకొంది. 60 శాతం మంది ఉద్యోగాన్ని సుస్థిరం చేసుకునేందుకు అధిక పని గంటలు పని చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జనరేషన్ జెడ్లోని ప్రతి ఐదు మందిలో ఒకరు గడిచిన ఏడాదికాలంలో వేరే రంగానికి మారాలనుకున్నారు. సొంత వ్యాపారం ప్రారంభించాలని 25 శాతం మంది భావించారు. 55 ఏళ్లు పైబడినవారిలో 17 శాతం మంది త్వరగా రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు.
Admin