Sunday, 08 September 2024 06:45:11 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

తాజ్ మహల్‌‌లో చెత్తా చెదారం శుభ్రం చేసిన విదేశీ వనిత.. దేశ ప్రతిష్టకు భంగమా..?

Date : 19 November 2023 08:57 AM Views : 104

జై భీమ్ టీవీ - జాతియం / : తాజ్ మహల్ అందాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ఇది తాజ్ మహల్, ఆగ్రా నగరంతో పాటు దేశంలో పర్యాటక రంగ పురోభివృద్ధికి దోహదపడుతోంది. తాజ్ మహల్ అందాలను ప్రపంచ పర్యాటకులు, ప్రముఖులు పలువురు మెచ్చుకుంటున్నా.. ఇక్కడ కాలుష్యం, పరిశుభ్రత మీద తరచూ విమర్శలు వస్తున్నాయి. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన పరిశ్రమల కారణంగా తాజ్ మహల్ పాలరాతి శోభను కోల్పోతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పక్కనే ఉన్న యమునా నది కాలుష్యం గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ లోపల కూడా పరిశుభ్రత లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ విదేశీ పర్యాటకురాలు తాజ్ మహల్ సందర్శనకు వెళ్లారు. అక్కడి ప్రధాన సమాధిలపై పడి ఉన్న చెత్తాచెదారం, షూ కవర్లను తొలగించాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సిబ్బందికి ఆమె సూచించారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో స్వయంగా ఆమె రంగంలోకి దిగి వాటిని శుభ్రం చేశారు. దీంతో తాజ్ మహల్ దగ్గర ఏఎస్ఐ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై రాజకీయ వివాదం రాజుకుంది. ఓ విదేశీ మహిళ తాజ్ మహల్‌ను శుభ్రం చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనంటూ సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. విదేశీ మహిళ తాజ్ మహల్‌ను శుభ్రం చేయాల్సిన దుస్థితిని కలిగించి కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశం పరువు తీసిందంటూ ఆయన ఆరోపించారు. గతంలో చీపురు పట్టుకుని లక్నో వీధుల్లో హడావుడి చేసిన వారు ఇప్పుడు ఎక్కడపోయారంటూ ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరిగిందని మోదీ సర్కారు ప్రచారం చేసుకుంటోందని.. అయితే ఈ ఘటన వాస్తవ పరిస్థితికి అద్దంపడుతోందని వ్యాఖ్యానించారు. తాజ్ మహల్‌లో పారిశుధ్య వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అయితే తాజ్ మహల్‌ పరిశుభ్రతపై వస్తున్న విమర్శలను ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రాజ్‌కు‌మార్ పటేల్ తోసి‌పుచ్చారు పర్యటకురాలు పబ్లిసిటీ స్టంట్ కోసం ఉద్దేశపూర్వకంగా అక్కడ క్లీన్ చేస్తున్నట్లు ఫొటోలు, వీడియో తీశాడని తెలిపారు. తాజ్‌మహల్‌లోని పలు చోట్ల డస్ట్‌బిన్‌లను ఉంచి సిబ్బందితో శుభ్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఫ్లోర్ క్లీనింగ్ తదితరాలను ప్రతి రోజూ చాలాసార్లు చేపడుతున్నట్లు తెలిపారు. తాజ్ మహల్‌లో పరిశుభ్రతను పట్టించుకోవడం లేదని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :