Saturday, 18 May 2024 09:42:10 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

అలిపిరి నడకమార్గం లో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచారం

Date : 28 October 2023 09:05 AM Views : 65

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తిరుపతిలో మళ్లీ పులి, ఎలుగుబంటి కలకలం రేపింది. అక్టోబర్‌ 24, 25వ తేదీ రాత్రి అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచారం అందరిలో భయాందోళనలు రేకిత్తించింది. తిరుపతిలో పాదయాత్ర మార్గంలో దృశ్యాలను పరిశీలించగా పులి, ఎలుగుబంటి సంచిరిస్తున్నట్టుగా గుర్తించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో వన్యప్రాణులు కనిపించాయి. పులి, ఎలుగుబంటి ఉన్నట్లు నిర్ధారించిన తిరుపతి దేవస్థానం అధికారులు గుంపులుగా తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రికులు నడక మార్గంలో ప్రయాణించరాదని హెచ్చరిస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో నరశింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది భక్తులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. గత మూడు రోజులుగా వేకువ జామున, రాత్రి సమయాలలో చిరుతలు సంచరిస్తున్నట్టుగా గుర్తించారు. గతంలో దాడులు చేసిన ప్రాంతంలోనే రెండు చిరుతల సంచారాన్ని గుర్తించిన సిబ్బంది….భధ్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. నడకదారిలో 24 న రాత్రి 8 గంటల సమయంలో చిరుత సంచారంపై కెమెరా ట్రాప్ లో గుర్తించారు. 10 రోజుల్లో రెండుసార్లు చిరుత సంచారం అందరిలో వణుకుపుట్టిస్తోంది. రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తం ఉండాలంటున్న అటవీశాఖ అధికారులు. వామ్మో ఇది ఊరు కాదు.. దెయ్యాల దిబ్బ.. ఇక్కడ 15 ఆత్మలు స్వైర విహారం చేస్తున్నాయ్‌.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కిన ఈ గ్రామం..! గత ఆగస్టులో అలిపిరి తీర్థయాత్ర మార్గంలో రాత్రిపూట ఆరేళ్ల బాలికను పులి చంపింది. ఈ ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఫారెస్ట్‌ గార్డుతో పాటు గుంపులుగా మాత్రమే భక్తులను తిరుపతి నడక మార్గంలోకి అనుమతించారు. ఆరేళ్ల బాలికను పులి చంపిన తర్వాత తిరుపతిలో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనుల్లో ఆరు పులులు, ఎలుగుబంటి చిక్కుకున్నాయి. యాత్రికులు హెచ్చరికలను ఖచ్చితంగా పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులుగా తప్ప పర్వతం ఎక్కవద్దని అధికారులు హెచ్చరించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :